Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్కు ప్రోస్టేట్ క్యాన్సర్..
ABN , Publish Date - May 19 , 2025 | 08:33 AM
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ప్రోస్టేట్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. 82 ఏళ్ల బైడెన్ ఆరోగ్యం గురించి ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం పదండి.

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden)కు ఇటీవల ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ అయింది. 82 ఏళ్ల వయస్సులో, ఆయనకు ఈ వ్యాధి బోన్లకు వ్యాపించడంతో మెటాస్టాటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్గా గుర్తించారు. అయితే, ఈ క్యాన్సర్ హార్మోన్ సెన్సిటివ్గా ఉండడం వల్ల చికిత్సకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. జో బైడెన్ ఇటీవల జరిగిన రూటిన్ ఆరోగ్య పరీక్షలలో మూత్ర సంబంధిత సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఈ లక్షణాల ఆధారంగా ప్రోస్టేట్ నోడ్యూల్ను గుర్తించారు. బయాప్సీ ద్వారా గ్లీసన్ స్కోర్ 9 (గ్రూప్ 5)తో ఉన్న కేన్సర్ను నిర్ధారించారు. ఇది వేగంగా వ్యాపించే క్యాన్సర్ను సూచిస్తుంది.
చికిత్స మార్గాలు
ప్రస్తుతం బైడెన్ వైద్య బృంద హార్మోన్ థెరపీ, రేడియేషన్ థెరపీ వంటి చికిత్సా మార్గాలను పరిశీలిస్తోంది. హార్మోన్ సెన్సిటివ్ క్యాన్సర్కి చికిత్సలు సాధారణంగా సమర్థవంతంగా ఉంటాయి. అయితే, మెటాస్టాటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్కు పూర్తిగా కోలుకునే చికిత్సలు లేవు, కానీ సరైన నిర్వహణతో రోగులు అనేక సంవత్సరాల పాటు జీవించవచ్చు. గత వారం కూడా, బైడెన్ ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. అతని మూత్ర సమస్యలు తీవ్రమైన తర్వాత, అతని ప్రోస్టేట్ నాడ్యూల్ను తిరిగి పరీక్షించగా, ఆ వ్యాధి అతని ఎముకలకు వ్యాపించిందని తేలింది. బైడెన్ కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఈ వ్యాధి మరింత ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇది హార్మోన్ సెన్సిటివ్ అని చెబుతున్నారు.
ట్రంప్ రియాక్షన్
బైడెన్ ఆరోగ్యం గురించి సమాచారం తెలుసుకున్న తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ వేదికగా స్పందించారు. జో బైడెన్ వైద్య పరీక్ష గురించి విని మెలానియా, నేను బాధపడ్డామన్నారు. ఈ సందర్భంగా ఆయన మొత్తం కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ, బైడెన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ట్రంప్.
వైద్యుల సూచన
ప్రోస్టేట్ గ్రంథిలో అభివృద్ధి చెందుతున్న ఈ క్యాన్సర్ సాధారణంగా వృద్ధులను ప్రభావితం చేస్తుంది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా, యువతలో కూడా దీని ప్రమాదం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ తీవ్రమైన క్యాన్సర్ కేసుల గురించి పురుషులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ను గుర్తించడానికి ప్రస్తుతం ఖచ్చితమైన, నమ్మదగిన మార్గం లేదని క్యాన్సర్ రీసెర్చ్ UK నిపుణుడు నాసర్ తురాబి అన్నారు.
ఈ రోగులకు ముందుగానే నిర్ధారణ
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డేటా ప్రకారం, 2022లో దాదాపు 37,948 మంది భారతీయ పురుషులు ప్రోస్టేట్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ సంవత్సరం దేశంలో నమోదైన 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసుల్లో ఇది దాదాపు మూడు శాతం. USలో 80 శాతం ప్రోస్టేట్ క్యాన్సర్ రోగులలో ముందుగానే నిర్ధారణ అవుతుండగా, ఆలస్యంగా నిర్ధారణ కేవలం 20 శాతం కేసులలో మాత్రమే జరుగుతుంది.
ఇవి కూడా చదవండి
IPL 2025 Playoffs: ఐపీఎల్ ప్లై ఆఫ్ కోసం 3 జట్లు ఖరారు.. నాలుగో ఛాన్స్ కోసం మూడు జట్లు పోటీ..
Gold Rates Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు
UPI New Rule: యూపీఐ కొత్త రూల్.. తప్పు చెల్లింపుల కట్టడి కోసం కీలక సౌకర్యం..
Jyoti Malhotra Case: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి షాకింగ్ ఫాక్ట్స్
Upcoming IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి