German: జర్మనీ విమానంపై చైనా యుద్ధనౌక లేజర్
ABN , Publish Date - Jul 09 , 2025 | 03:02 AM
ఎర్ర సముద్రం మీదుగా ఎగురుతున్న తమ విమానాన్ని.. చైనా మిలటరీకి చెందిన యుద్ధనౌక ఇటీవలే లేజర్ కిరణాలతో టార్గెట్ చేసిందని జర్మనీ ఆరోపించింది.

బెర్లిన్, జూలై 8: ఎర్ర సముద్రం మీదుగా ఎగురుతున్న తమ విమానాన్ని.. చైనా మిలటరీకి చెందిన యుద్ధనౌక ఇటీవలే లేజర్ కిరణాలతో టార్గెట్ చేసిందని జర్మనీ ఆరోపించింది. తమదేశంలోని చైనా రాయబారిని పిలిపించి.. ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఎర్రసముద్రంలో తిరిగే వాణిజ్య నౌకలపై యెమెన్కు చెందిన హూతీ రెబెల్స్ దాడులు చేస్తున్న నేపథ్యంలో.. వాటిని రక్షించేందుకు యూరోపియన్ యూనియన్ ఎర్ర సముద్రంపై ‘ఆపరేషన్ యాస్పైడ్స్ పేరిట నిఘా చర్యలు చేపట్టింది. నిఘా విధుల్లో ఉన్న తమ విమానంపై ఎలాంటి హెచ్చరికలూ చేయకుండా, కారణం కూడా చెప్పకుండా చైనా లేజర్ కిరణాలను ప్రయోగించిందని జర్మనీ మండిపడింది.