Share News

China Warns US: నిప్పుతో చెలగాటం వద్దు.. అమెరికాపై మండిపడ్డ చైనా

ABN , Publish Date - Jun 01 , 2025 | 08:16 AM

తైవాన్‌పై చైనా ఎప్పటికైనా తన మిలిటరీ శక్తిని ప్రయోగించే ఛాన్సుందంటూ అమెరికా చేసిన వ్యాఖ్యలపై కమ్యునిస్టు దేశం మండిపడింది. నిప్పుతో చెలగాటం వద్దని వార్నింగ్ ఇచ్చింది.

China Warns US: నిప్పుతో చెలగాటం వద్దు.. అమెరికాపై మండిపడ్డ చైనా
China Taiwan tension

ఇంటర్నెట్ డెస్క్: తైవాన్ వివాదంపై అమెరికా చేసిన వ్యాఖ్యలకు చైనా ఘాటుగా స్పందించింది. నిప్పుతో చెలగాటం వద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. చైనాను కట్టడి చేసేందుకు తైవాన్ వివాదాన్ని పావుగా వాడుకోవద్దని హితవు పలికింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి తాజా పత్రికా సమావేశంలో కీలక ప్రకటన చేశారు.

తైవాన్ విషయంలో చైనా వ్యూహాలు ప్రపంచశాంతికి ముప్పుగా మారొచ్చని అమెరికా ఢిఫెన్స్ సెక్రెటరీ పీట్ హెగ్‌సెత్ శనివారం ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రాంతీయ అస్థిరతలను రెచ్చగొట్టేలా ఉన్న చైనా ప్లాన్‌లను అడ్డుకునేందుకు అమెరికా, దాని మిత్ర దేశాలు చేయాల్సింది ఎంతో ఉందని అన్నారు. ఈ విషయంలో దాచి పెట్టేందుకు కూడా ఏమీ లేదని అన్నారు. చైనాతో పొంచి ఉన్న ముప్పు ఓ వాస్తవమని కూడా వ్యాఖ్యానించారు. షాంగ్రీ లా డైలాగ్ సమావేశాల్లో ఈ కామెంట్స్ చేశారు.


‘ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా మిలిటరీ శక్తిని వినియోగించే అవకాశం ఉంది. తైవాన్‌పై చర్యలు తీసుకునేందుకు వీలుగా చైనా మిలిటరీ బలగాలు నిత్యం కసరత్తు చేస్తున్నాయి’ అని ఆయన అన్నారు.

ఇక హెగ్‌సెత్ వ్యాఖ్యలపై చైనా అధికారికంగా అమెరికాకు తన అభ్యంతరాల గురించి చెప్పింది. ఈ కామెంట్స్‌ను ఖండిస్తున్నట్టు తెలిపింది. తైవాన్ అంశం తమ అంతర్గత వ్యవహారమని కూడా తేల్చి చెప్పింది. ఇతర దేశాలకు ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు లేదని పేర్కొంది.

తైవాన్ తమ భూభాగమని చైనా చెబుతోంది. అయితే, స్వీయ పాలన తమ హక్కు అని తైవాన్ వాదిస్తోంది. బలవంతంగానైనా తైవాన్‌ను తమ భూభాగంగా చేసుకునే అవకాశం కూడా ఉందని గతంలోనే చైనా విస్పష్ట ప్రకటన చేసింది.


1949 నాటి చైనా అంతర్యుద్ధంలో ఓడిన జాతీయవాదులు తైవాన్‌కు పారిపోయారు. నాటి నుంచి తైవాన్ వాసులు చైనా ఆధిపత్య నీడలు లేని స్వతంత్ర పాలనను కోరుకుంటున్నారు. తైవాన్‌ను స్వతంత్ర దేశంగా ఇప్పటివరకూ 12 దేశాలు మాత్రమే గుర్తించాయి. ఇక అమెరికా మాత్రం తైవాన్‌కు మిలిటరీ పరంగా అండదండలు అందిస్తోంది.

ఇవీ చదవండి:

ఆపరేషన్ సిందూర్‌పై కొలంబియా అభ్యంతరం.. స్పందించిన శశి థరూర్

వాస్తవాన్ని వివరించిన భారత్.. పాక్‌కు మద్దతు ఉపసంహరించిన కొలంబియా

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 01 , 2025 | 08:25 AM