Air India plane: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు
ABN , Publish Date - Jun 13 , 2025 | 12:17 PM
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో 271 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘోర దుర్ఘటనను మరువక ముందు మరో ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో..

అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో 271 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘోర దుర్ఘటనను మరువక ముందు మరో ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఎయిరిండియా (Air India) విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. AI 379 విమానం 156 మంది ప్రయాణికులతో శుక్రవారం ఉదయం 9.30 గంటలకు పుకెట్ నుంచి ఢిల్లీ బయలుదేరింది. అయితే మార్గ మధ్యలో విమానంలో బాంబు (Bomb threat) ఉన్నట్లు విమాన సిబ్బందికి బెదిరింపు వచ్చింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. విమానాన్ని థాయిలాండ్లో (Emergency landing) ఎమర్జెన్సీ ట్యాండింగ్ చేశారు.
విమానం గాల్లో ఉండగా బెదిరింపు మెయిల్ రావడంతో అధికారుల సూచన మేరకు పైలెట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారని ఓ ప్రకటనలో తెలిపారు. ఆ సమయంలో అండమాన్ సముద్రం మీదుగా వెళ్తున్న విమానం.. చాలా సేపు గాలిలోనే చక్కర్లు కొట్టి చివరికి సురక్షితంగా ల్యాండ్ అయిందన్నారు. విమానం ఐలాండ్లో దిగిన వెంటనే అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే విమానంలో ఎలాంటి బాంబూ కనిపించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
శ్వేతసౌధంలో ట్రెజరీ సెక్రెటరీతో మస్క్ బాహాబాహీ.. విషయం తెలిసి ట్రంప్ షాక్
మస్క్ తప్పు చేస్తున్నారు.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి