Share News

జీవితాంతం అవస్థే.. మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ అకస్మాత్తుగా అటాక్‌

ABN , Publish Date - May 30 , 2025 | 01:42 PM

ఆకస్మాత్తుగా మాట పడిపోతుంది. లేకుంటే తడబాటు ఎదుర్కొంటారు. చూపు కూడా మందగిస్త్తుంది. కాళ్లు చేతులు తిమ్మిరిగా అనిపిస్తుంటే ఇది మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ వ్యాధి లక్షణాలు కావొచ్చు. ఈ జబ్బు వచ్చేంత వరకు గుర్తించలేరు. ఒకసారి వస్తే జీవితాంతం అవస్థ పడాల్సిందే. సాధారణంగా అనేక రకాల లక్షణాలతో ఈ వ్యాధి ఉంటుంది. వరల్డ్‌ మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ డే సందర్భంగా ‘మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా’ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆ మేరకు ప్రత్యేక కథనం..

జీవితాంతం అవస్థే.. మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ అకస్మాత్తుగా అటాక్‌

- నరాలను కప్పే రక్షణ కవచంపై ప్రభావం

- మాట రాదు.. వచ్చినా తడబాటే

- చూపు మందగింపు

- పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువ

- ముందే గుర్తిస్తే తీవ్రతకు చెక్‌

- నేడు వరల్డ్‌ మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ డే

హైదరాబాద్‌ సిటీ: సాధారణంగా మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ యవతలో ఎక్కువగా కనిపిస్తోంది. టీనేజీ వయస్సులో మొదలు కావచ్చు. కొందరిలో 20 ఏళ్లలో మరికొందరిలో 30 ఏళ్ల లోపు రావచ్చు. పురుషుల కంటే మహిళల్లోనే ఈ జబ్బు తీవ్రత ఎక్కువ. మరణం ఏర్పడదు కాదు. కానీ జీవితాంతం ఇబ్బంది పెడుతుంది. నయం చేయలేని వ్యాధి అయిన్నప్పటికీ ప్రతీ యేడు పరిశోధనలతో కొత్త పురోగతులు జరుగుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. అవగాహన పెరిగే కొద్దీ, దీని కారణాలు, నివారణలపై పరిశోధనలు మనను ఈ వ్యాధికి ఒక పరిష్కారం గుర్తించే అవకాశాలు ఉంటాయంటున్నారు.


ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌

మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ (ఎంఎస్‌) ఒక ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌. శరీర రక్షణ వ్యవస్థ మన సొంత ఆరోగ్యకరమైన కణాలను ఈ సందర్భంలో నరాలను కప్పే రక్షణ కవచంపై దాడి చేస్తోంది. దీంతో సరాలకు సంకేతాలు సరిగ్గా అందదు. ఈ సమస్యను నివారించడానికి మందులు అందుబాటులో ఉన్నాయి. ఇవి వ్యాధిని పూర్తిగా నయం చేయకపోయినా, వ్యాధి తీవ్రతను తగ్గించడానికి అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.


ప్రాథమిక దశలో గుర్తిస్తే...

వైద్యుల వద్దకు వచ్చే వంద మందిలో 15 మంది వరకు మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ సమస్యతో బాధపడుతున్నారు. రెండు, మూడో దశలో ఆస్పత్రికి వస్తున్నారు. మొదటి దశలోనే ఆస్పత్రికి వస్తే మున్ముందు ఇతర సమస్యలను నివారించే అవకాశముంది. ఈ జబ్బును ఎంఆర్‌ఐ, ఇతర పరీక్షల ద్వారా నిర్ధారించి, తీవ్రత నుంచి తప్పించడానికి అవకాశముంది.

డాక్టర్‌ శిల్పా కేసీరెడ్డి,

న్యూరాలజిస్టు, మెడికవర్‌ ఆస్పత్రి



ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates In India on May 30: నేడూ స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Fee Reimbursement: ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌కు 75 శాతం హాజ‌రు తప్పనిసరి

Read Latest Telangana News and National News

Updated Date - May 30 , 2025 | 01:42 PM