Share News

JNTU: జేఎన్‌టీయూ స్నాతకోత్సవానికి తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే..

ABN , Publish Date - May 20 , 2025 | 08:15 AM

నగరంలోని కూకట్‏పల్లిలోగల జవహర్‏లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ (JNTU) స్నాతకోత్సవం నిర్వహణకు తేదీని ఖరారు చేశారు. జేఎన్‌టీయూ13వ స్నాతకోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించాలన్న దారిపై వర్సిటీ అధికారులు గత కొద్దిరోజులుగా సమాలోచన చేస్తున్నారు. చివరకు జూన్‌ 3న నిర్వహించాలని నిర్ణయించారు.

JNTU: జేఎన్‌టీయూ స్నాతకోత్సవానికి తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే..

హైదరాబాద్‌ సిటీ: జేఎన్‌టీయూ(JNTU) 13వ స్నాతకోత్సవం నిర్వహణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. జూన్‌ 3న నిర్వహించే నిమిత్తం వర్సిటీ అధికారులు ప్రతిపాదనలు పంపగా గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆమోదం తెలిపారు. సోమవారం జరిగిన డైరెక్టర్ల సమావేశంలో వైస్‌చాన్సలర్‌ డాక్టర్‌ కిషన్‌ కుమార్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. స్నాతకోత్సవం నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని డైరెక్టర్లను అధికారులను ఆదేశించారు. వాస్తవానికి మార్చి రెండో వారంలో స్నాతకోత్సవం నిర్వహించాల్సి ఉండగా సాంకేతిక కారణాల రీత్యా వాయిదా పడింది.

ఈ వార్తను కూడా చదవండి: GHMC: ఆ భవనాల సెల్లార్లు ఎంతవరకు సురక్షితం..


city3.2.jpg

కాగా, స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్‌ను ఎవరికి ప్రదానం చేయాలనే అంశంపై అధికారుల మధ్య ఇంకా స్పష్టత రాలేదని తెలిసింది. డీఆర్‌డీఓ చైర్మన్‌ పేరును కొందరు ప్రతిపాదించగా, ప్రజా జీవితం, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ రంగాల నుంచి కూడా ప్రముఖుల పేర్లను గౌరవ డాక్టరేట్‌ కోసం పరిశీలించాలని మరికొందరు డైరెక్టర్లు వీసీకి సూచించినట్లు సమాచారం. సమావేశంలో రెక్టార్‌ విజయ్‌ కుమార్‌ రెడ్డి, రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరావు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates Today: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Rice Production: సస్యశ్యామల భారతం

Siricilla : పాత బకాయిలు లేనట్లేనా..?

Telangana fire services: ఇక.. మహిళా ఫైర్‌ఫైటర్లు

Read Latest Telangana News and National News

Updated Date - May 20 , 2025 | 08:15 AM