Share News

Chennai: పాదయాత్ర బృందంపైకి దూసుకెళ్లిన కారు.. - ముగ్గురు భక్తుల మృతి

ABN , Publish Date - Jun 12 , 2025 | 10:54 AM

తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా మనలూరు వద్ద బుధవారం వేకువజామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.

Chennai: పాదయాత్ర బృందంపైకి దూసుకెళ్లిన కారు.. - ముగ్గురు భక్తుల మృతి

- నలుగురికి తీవ్రగాయాలు

చెన్నై: కడలూరు(Kadaluru) జిల్లా మనలూరు వద్ద బుధవారం వేకువజామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కడలూరు జిల్లా విరుదాచలం నుండి కళ్ళకురిచ్చి జిల్లాలోని మేల్‌నారియప్పనూరులో ఉన్న సెయింట్‌ ఆంటోనియర్‌ ఆలయానికి పదిమందికి పైగా భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. కడలూరు సమీపం మనలూరు వద్ద రోడ్డు పక్కన నడచి వెళుతున్న ఈ బృందంపై వేగంగా వచ్చిన ఓ కారు దూసుకెళ్ళింది.


nani2.3.jpg

ఈ దుర్ఘటనలో హృదయసామి (40), ఆయన కుమార్తె సహాయమేరీ(18), స్టెల్లామేరీ అనే ముగ్గురు భక్తులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు, క్షతగాత్రులను చికిత్స కోసం విరుదాచలం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు.


nani2.4.jpg

ఈ వార్తలు కూడా చదవండి.

పెరిగిన గోల్డ్, వెండి ధరలు..

హలం పట్టి.. పొలం దున్ని..

Read Latest Telangana News and National News

Updated Date - Jun 12 , 2025 | 08:26 PM