Share News

Hyderabad: సందర్శకులుగా వచ్చి.. మత్తులో ముంచి..

ABN , Publish Date - Jun 07 , 2025 | 07:53 AM

సందర్శకులుగా వస్తున్న నైజీరియన్లు.. డ్రగ్స్‏తో ఇక్కడి యువతను పెడదారి పట్టిస్తున్నారు. పోలీసులు వీరి ఆట కట్టిస్తు్న్నా.. కొత్తకొత్త మార్గాలను వెతుక్కుంటూ యువతను డ్రగ్స్‏కు బానిసలుగా మారుస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: సందర్శకులుగా వచ్చి.. మత్తులో ముంచి..

- నగరాన్ని వదలని నైజీరియన్స్‌

- నెట్‌వర్క్‌ను పెంచుకుంటూ డ్రగ్స్‌ విక్రయం

- నైజీరియా నుంచి బల్క్‌గా మాదకద్రవ్యాలు

- డ్రగ్‌ డీలర్ల ద్వారా నగరానికి..

- స్మగ్లర్స్‌ కదలికలపై పోలీసుల దృష్టి

హైదరాబాద్‌ సిటీ: నైజీరియన్‌(Nigerian) స్మగ్లర్స్‌ నగరాన్ని వదలడం లేదు. సందర్శకులుగా వచ్చి ఇక్కడి వారిని మత్తులో ముంచుతున్నారు. డ్రగ్స్‌ వినియోగదారులు, సరఫరాదారులతో నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నారు. మోస్ట్‌ వాంటెడ్‌ అంతర్జాతీయ నైజీరియన్‌ ఘరానా స్మగ్లర్‌ ఇమాన్యుయేల్‌ను ఇటీవల అరెస్ట్‌ చేశారు. అతడి వద్ద నార్కోటిక్‌ బ్యూరో పోలీసులు రూ.1.25 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన నార్కోటిక్‌ బ్యూరో, హైదరాబాద్‌ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ పోలీసులు నైజీరియన్స్‌ కదలికలపై ప్రత్యేక దృష్టిసారించారు.


అరెస్టయిన కొందరు నైజీరియన్లు

ఫ గినియా దేశానికి చెందిన మౌస్సా కమారా అలియాస్‌ రోమియోను హెచ్‌ న్యూ పోలీసులు ఇటీవల అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ సహా.. వివిధ నగరాల్లో నమోదైన డ్రగ్స్‌ కేసుల్లో ఇతడు ప్రధాన నిందితుడు. గత ఏడాది హైదరాబాద్‌లో పట్టుబడ్డ సూడాన్‌ దేశానికి చెందిన డ్రగ్స్‌ స్మగ్లర్‌ హనీన్‌ కేసులోనూ రోమియో ప్రధాన నిందితుడు. రోమియో ఇచ్చిన డ్రగ్స్‌ను నగరంలో డెడ్‌ డ్రాప్‌ అనే పద్ధతిలో హనీన్‌ సరఫరా చేసేవాడు.

- 2012లో బిజినెస్‌ వీసాపై ఇండియాకు వచ్చిన ఇకెచుకువు సెల్విస్టర్‌ అలియాస్‌ సెల్విస్టర్‌ ముంబైలో వస్త్ర బిజినెస్‌ చేస్తూ.. పాస్‌పోర్టు కేసులో 2019లో అరెస్ట్‌ అయ్యాడు. జైలు నుంచి బయటక వచ్చాక ముంబై ఉల్వే ప్రాంతంలో ఉంటున్న నైజీరియన్‌ స్నేహితుల వద్దకు చేరాడు. వారి ఆదేశాలతో డ్రగ్స్‌ స్మగ్లర్‌గా మారడానికి హైదరాబాద్‌ వచ్చాడు. టోలీచౌకి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. సీపీ సీవీ ఆనంద్‌ ఆదేశాల మేరకు సెల్విస్టర్‌ను నైజీరియాకు డిపోటేషన్‌ చేశారు.


- రెండు నెలల క్రితం లంగర్‌హౌజ్‌ బాపూఘాట్‌ వద్ద నైజీరియన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 1,300 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. విచారించగా ఓలీవర్‌ ఒగోచుకువ్‌ అలియాస్‌ జాన్సన్‌ అలియాస్‌ జాన్‌ అలియాస్‌ ఎంజీగా తేలింది. ఢిల్లీకి చెందిన మరో ఘరానా నైజీరియన్‌ డ్రగ్స్‌ స్మగ్లర్‌ ఓయిబో ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సరఫరా చేయడానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.


నిఘా వైఫల్యం

దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులపై ఎఫ్‌ఆర్‌ఆర్‌వోలు, పోలీసుల నిఘా కొరవడటంతో పలు నగరాల్లో అక్రమార్కులు తిష్ఠవేస్తున్నారు. కొంతమంది స్వదేశీ నేరగాళ్లతో కలిసి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించుకొని ఐడెంటిటీని మార్చుకుంటున్నారు. తరచూ వివిధ నగరాలకు మకాం మార్చుతూ.. పోలీసుల కంటపడకుండా నేరాలకు పాల్పడుతూ ఈజీ మనీకి అలవాటుపడి అందినంత దండుకుంటున్నారు. పట్టుబడుతున్న విదేశీయుల్లో ఎక్కువమంది నైజీరియన్స్‌ ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.


నైజీరియా నుంచి బల్క్‌గా డ్రగ్స్‌

కొద్ది రోజుల క్రితం పోలీసులకు పట్టుబడిన ఘరానా స్మగ్లర్‌ ఓలీవర్‌ను విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓలీబో అనే డ్రగ్‌ డీలర్‌ ద్వారా నగరానికి మాదకద్రవ్యాలు వస్తున్నట్లు తెలిసింది. ఢిల్లీలో ఉంటున్న ఓయిబోకు నైజీరియా నుంచి బల్క్‌గా డ్రగ్స్‌ అందుతుంది. ఓయిబో ఇండియాలో మెట్రోపాలిటన్‌ నగరాల్లో స్థిరపడిన నైజీరియన్స్‌ స్మగ్లర్స్‌కు మాత్రమే బల్క్‌గా డ్రగ్స్‌ సరఫరా చేస్తాడు. వేరే ఎవరికీ డ్రగ్స్‌ను సరఫరా చేయడని తెలిసింది. ఈ మేరకు ఓయిబో హైదరాబాద్‌లో తన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. అతడి ఆదేశాలతో డ్రగ్స్‌ తీసుకొచ్చిన ఓలీవర్‌.. ఓయిబో చెప్పినట్టు డెడ్‌ డ్రాప్‌ పద్ధతిలో ఇక్కడి నైజీరియన్స్‌కు సరఫరా చేసి వెళ్లిపోతాడు.


నైజీరియా నుంచి బల్క్‌గా డ్రగ్స్‌

కొద్ది రోజుల క్రితం పోలీసులకు పట్టుబడిన ఘరానా స్మగ్లర్‌ ఓలీవర్‌ను విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓలీబో అనే డ్రగ్‌ డీలర్‌ ద్వారా నగరానికి మాదకద్రవ్యాలు వస్తున్నట్లు తెలిసింది. ఢిల్లీలో ఉంటున్న ఓయిబోకు నైజీరియా నుంచి బల్క్‌గా డ్రగ్స్‌ అందుతుంది. ఓయిబో ఇండియాలో మెట్రోపాలిటన్‌ నగరాల్లో స్థిరపడిన నైజీరియన్స్‌ స్మగ్లర్స్‌కు మాత్రమే బల్క్‌గా డ్రగ్స్‌ సరఫరా చేస్తాడు. వేరే ఎవరికీ డ్రగ్స్‌ను సరఫరా చేయడని తెలిసింది. ఈ మేరకు ఓయిబో హైదరాబాద్‌లో తన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. అతడి ఆదేశాలతో డ్రగ్స్‌ తీసుకొచ్చిన ఓలీవర్‌.. ఓయిబో చెప్పినట్టు డెడ్‌ డ్రాప్‌ పద్ధతిలో ఇక్కడి నైజీరియన్స్‌కు సరఫరా చేసి వెళ్లిపోతాడు.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

రాష్ట్రంలో పర్సెంటేజీల పాలన

Read Latest Telangana News and National News

Updated Date - Jun 07 , 2025 | 07:53 AM