Smart Phone: ఇంట్లో అందరూ స్మార్ట్ఫోన్ వాడుతారు.. నాకు మాత్రం డబ్బా ఫోనా అంటూ..
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:16 AM
ఇంట్లో అందరు స్మార్ట్ ఫోన్ వాడుతారు.. నాకు మాత్రం డబ్బా ఫోను ఇస్తారా అంటూ తీవ్ర మనస్థాపానికి గురై ఓ వ్యక్తి చీరతో ఫ్యానుకు ఉరేసుకుని మృతిచెందిన సంఘటన హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.

- స్మార్ట్ఫోన్ ఇప్పించడం లేదని కూలీ ఆత్మహత్య
హైదరాబాద్: ఇంట్లో అందరు స్మార్ట్ ఫోన్(Smart Phone) వాడుతారు.. నాకు మాత్రం డబ్బా ఫోను ఇస్తారా అంటూ తీవ్ర మనస్థాపానికి గురై ఓ వ్యక్తి చీరతో ఫ్యానుకు ఉరేసుకుని మృతిచెందిన సంఘటన హయత్నగర్ పోలీస్స్టేషన్(Hayath Nagar Police Station) పరిధిలో జరిగింది. వివరాల ప్రకారం.. భాగ్యలత శాంతినగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న బోయ శ్రీను(43) కూలీ పని చేస్తాడు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉంది. ఇంట్లోని అందరు స్మార్ట్ఫోన్లు వాడుతున్నారు.
శ్రీను(Srinu) మాత్రం చిన్న ఫోన్ వాడుతున్నాడు. కొన్ని రోజులుగా శ్రీను స్మార్ట్ఫోన్ కావాలని ఇంట్లో గొడవ పడుతున్నాడు. ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. వారం రోజులు ఆగు ఫోన్ కొనిపిస్తామని భార్య చెప్పింది. అయినా వినకుండ మనస్థాపానికి గురైన శ్రీను శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
తెలంగాణ గవర్నర్ను కలిసిన బాలకృష్ణ
Read Latest Telangana News and National News