Share News

Hyderabad: ఒడిశా నుంచి హైదరాబాద్‏కు..

ABN , Publish Date - May 13 , 2025 | 10:38 AM

ఒడిశా నుంచి హైదరాబాద్‏లోని మల్లాపూర్‎కు తరలించిన గంజాయిని పోలీసులులు పట్టుకున్నారు. ఓ గోదాంను ఏర్పాటుచేసి దాంట్లో నిల్వచేసిన 1.6 క్వింటాళ్ల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: ఒడిశా నుంచి హైదరాబాద్‏కు..

- గోదాంలో నిల్వ

- 1.6 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం

- ఇద్దరు స్మగ్లర్ల అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ: మల్లాపూర్‌(Mallapur)లో అక్రమంగా నిల్వ చేసిన 1.6 క్వింటాళ్ల గంజాయిని ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్స్‌ను అరెస్ట్‌ చేశారు. సోమవారం నాంపల్లి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎక్సైజ్‌ అదనపు కమిషనర్‌ సయ్యద్‌ యాసిన్‌ ఖురేషీ, రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్‌ పి. దశరథ్‌ వివరాలు వెల్లడించారు. మల్లాపూర్‌ ఎస్సీఎల్‌ ప్రాంతంలో పాడుబడిన గోదాం వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: KTR: రాసిపెట్టుకోండి.. రాష్ట్రంలో రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే..


విచారించగా ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి(Malkangiri) జిల్లాకు చెందిన రాంబాబు, హన్మకొండకు చెందిన కట్ల వివేక్‌రెడ్డిగా తేలింది. ఒడిశా నుంచి కారులో గంజాయి తీసుకొచ్చి గోదాములో నిల్వ చేసినట్లు అంగీకరించారు. పోలీసులు గోదాంలో తనిఖీ చేసి రెండు కిలోలు, కిలో ప్యాకెట్లు చేసి ఉన్న 1.6 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు దగ్గుమల్లి మధుకిరణ్‌ పరారీలో ఉన్నాడు. సమావేశంలో మల్కాజిగిరి ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నవీన్‌కుమార్‌, ఏఈఎస్‌ ముకుందరెడ్డి, ఉప్పల్‌ ఎస్‌హెచ్‌ఓ బి. ఓంకార్‌, డీటీఎఫ్‌ సీఐ భరత్‌ భూషణ్‌, ఎస్సైలు నరేశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


పలు ప్రాంతాల్లో 12.230 కిలోల గంజాయి స్వాధీనం

స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన ఎక్సైజ్‌ పోలీసులు ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 12.230 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 6.50 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. చర్లపల్లి, రాంపల్లి ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన పోలీసులు మధ్యప్రదేశ్‌కు చెందిన హరికుశ్వాహ వద్ద 4 కిలోలు, ఒడిశాకు చెందిన బైనాథ్‌ బిశ్వాల్‌ వద్ద 6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

- నాందేడ్‌(Nanded) నుంచి డీసీఎంలో గంజాయి తీసుకొస్తున్నారని ఎక్సైజ్‌ పోలీసులకు సమాచారం అందింది. నగర శివారులో వాహనాన్ని తనిఖీ చేయగా 2.230 కిలోల గంజాయి లభించిందని ఎస్‌ఐ బాలరాజు తెలిపారు. డ్రైవర్‌ రాజును అరెస్ట్‌ చేశారు.


432 కిలోల నల్లబెల్లం పట్టివేత

నగరం నుంచి నాగర్‌కర్నూల్‌ ఎండబెట్ల గ్రామానికి నల్లబెల్లం తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. నిఘా పెట్టి నగర శివారులో వాహనాన్ని పట్టుకున్నారు. అందులో ఉన్న 432 కిలోల బెల్లం, 10 కిలోల ఆలం(పటిక)ను స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ శివకుమార్‌ను అరెస్ట్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

Maoists: గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు

Secret War Manual: యుద్ధంలో నడిపించిన రహస్య గైడ్‌

టోపీ పెట్టుకున్న కోడెనాగు..

Read Latest Telangana News and National News

Updated Date - May 13 , 2025 | 10:38 AM