Share News

Stock Market Friday Closing: భారత మార్కెట్ల దమ్ము ప్రపంచానికి తెలిసింది

ABN , Publish Date - May 16 , 2025 | 07:37 PM

భారత మార్కెట్ల దమ్మెంతో ఈ వారం ప్రపంచానికి తెలిసొచ్చింది. ఒక పక్క యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ ఈ వారంలో BSE సెన్సెక్స్ 3.6 శాతం, నిఫ్టీ 50.. 4.2 శాతం పెరిగడం భారత మార్కెట్ల ధృడత్వాన్ని..

Stock Market Friday Closing: భారత మార్కెట్ల దమ్ము ప్రపంచానికి తెలిసింది
Stock Market Friday Closing

Stock Market Friday Closing: నిన్నటి(గురువారం) సెషన్‌లో ఏడు నెలల గరిష్ట స్థాయిని నమోదు చేసిన తర్వాత, ఇవాళ (మే 16) భారతీయ ఈక్విటీ సూచీలు ఒత్తిడిలో కదలాడాయి. అయినప్పటికీ నిఫ్టీ 25,000 మార్కుకు పైన ముగియడం విశేషం. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 200.15 పాయింట్లు లేదా 0.24 శాతం తగ్గి 82,330.59 వద్ద ఉంది. నిఫ్టీ 42.30 పాయింట్లు లేదా 0.17 శాతం తగ్గి 25,019.80 వద్ద స్థిరపడింది. కాగా, నేటితో ముగిసిన ఈ వారంలో, BSE సెన్సెక్స్ 3.6 శాతం, నిఫ్టీ 50.. 4.2 శాతం పెరిగడం భారత మార్కెట్ల ధృడత్వాన్ని సూచిస్తుంది. ఒక పక్క అమెరికా టారిఫ్స్ గందరగోళం, మరో పక్క ఆపరేషన్ సింధూర్ యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ మన మార్కెట్లు ఏమాత్రం జంకలేదు.

ఇవాళ ప్రధాన సూచీల కంటే స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు మెరుగైన పనితీరు కనబరిచాయి. BSE మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం పెరగగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం పెరిగింది. రంగాల విషయానికొస్తే, మీడియా, విద్యుత్, PSU, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 1 నుంచి 1.7 శాతం పెరిగాయి. ఐటీ ఇండెక్స్ దాదాపు 1 శాతం తగ్గింది. నిఫ్టీలో భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఆటో, అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటా కన్స్యూమర్, ఎటర్నల్ ప్రధాన లాభాలను ఆర్జించగా, భారతీ ఎయిర్‌టెల్, JSW స్టీల్, ఇన్ఫోసిస్, SBI, HCL టెక్నాలజీస్ నష్టపోయాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వాణిజ్య యుద్ధం కారణంగా ఏప్రిల్‌లో తీవ్ర అమ్మకాల నుండి S&P 500 పూర్తిగా కోలుకోవడంతో వాల్ స్ట్రీట్ స్టాక్స్ గురువారం మిశ్రమంగా ముగిశాయి. ట్రంప్ తెచ్చిన టారిఫ్స్ కారణంగా వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నప్పటికీ అధిక సుంకాలను తగ్గించడానికి వాషింగ్టన్ తగిన ఒప్పందాలు చేరుకుంటుందని పెట్టుబడిదారులు ఆశతో ఉన్నారు.

స్టాక్ బ్లాక్ డీల్స్‌తో JSW ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, భారతి ఎయిర్‌టెల్ షేర్లు 2 శాతానికి పైగా పడిపోయాయి. సెంట్రల్ రైల్వే నుండి ఆర్డర్ రావడతో RVNL షేర్లు 9 శాతం పెరిగాయి. క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ షేర్లు 7 శాతం పెరిగాయి. Q4 లాభం 22 శాతం పెరిగడం, Q4 ఆదాయాలు మెరుగుపడిన తర్వాత JSW ఎనర్జీ షేర్ ధర 3 శాతం పెరిగింది.

BSEలో దాదాపు 80 స్టాక్‌లు తమ 52 వారాల గరిష్టాలను తాకాయి. వాటిలో మజాగాన్ డాక్, మెడ్‌ప్లస్ హెల్త్, బజాజ్ హోల్డింగ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ డైనమిక్స్, సోలార్ ఇండస్ట్రీస్, APL అపోలో, ICICI బ్యాంక్, రెడింగ్టన్, మాక్స్ ఫైనాన్షియల్, దాల్మియా భారత్, అనుపమ్ రసాయన్, మొదలైనవి ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

Terrorists Arrested: తీవ్రవాదులు అరెస్ట్.. ఆయుధాలు సీజ్

Crime News: యజమాని భార్యతో వివాహేతర సంబంధం.. డ్రైవర్ బెదిరింపులు

Operation Sindoor: సత్తా చాటిన ఆకాశ్‌

For More AP News and Telugu News


గూడ్స్ రైలు కింద కార్మికుడు

Updated Date - May 16 , 2025 | 07:37 PM