Stock Markets: ఐటీ, FMCG, బ్యాంకింగ్ హవా.. శుక్రవారం భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
ABN , Publish Date - May 23 , 2025 | 05:33 PM
ఇవాళ మార్కెట్లు బౌన్స్ బ్యాక్ అయినప్పటికీ , నిఫ్టీ, సెన్సెక్స్ దాదాపు ఒక శాతం వారపు నష్టాలను నమోదు చేశాయి. పెద్ద మొత్తంలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు అమ్మకాలకు పాల్పడ్డమే దీనికి ప్రధాన కారణం.

బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ వారాంతం (శుక్రవారం)లో భారీ లాభాలతో ముగిశాయి. హెవీవెయిట్ IT, FMCG స్టాక్లు లాభాలను అందించడంతో నిన్నటి నష్టాల్ని పూడుస్తూ పునరాగమనాన్ని ప్రదర్శించాయి. నిఫ్టీ FMCG 1.6 శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఐటీ ఒక్కొక్క శాతం పెరిగాయి. నిఫ్టీ బ్యాంక్ 0.8 శాతం పెరిగింది. నిఫ్టీ మెటల్, నిఫ్టీ PSU బ్యాంక్ వరుసగా 0.7 శాతం, 0.5 శాతం పెరిగాయి. నిఫ్టీ ఫార్మా మాత్రం 0.4 శాతం క్షీణించింది.
ఈ ఉదయం మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమైన తర్వాత, ఐటీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ సూచీల సపోర్ట్తో బెంచ్ మార్క్ సూచీలు పైగశాయి. మరోవైపు, ప్రపంచ మార్కెట్లలో రికవరీని మన మార్కెట్లు ఫాలో కావడం సూచీలు పెరిగేందుకు కారణమైంది. ఇక ఇవాళ, BSE సెన్సెక్స్ 769.09 పాయింట్లు పెరిగి 81,721.08 వద్ద ముగిసింది. NSE నిఫ్టీ 243.45 పాయింట్లు పెరిగి 24,853.15 వద్ద స్థిరపడింది. దీంతో గురువారం ఎదురైన నష్టాలు చాలా వరకు తగ్గాయి.
IT, FMCG, బ్యాంకింగ్ రంగాల షేర్లలో పెరుగుదల
బ్లూ-చిప్ కౌంటర్లలో.. ముఖ్యంగా సెన్సెక్స్లో అగ్రశ్రేణి లాభాలను పొందిన వాటిలో ఐటీసీ, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, HCL టెక్, పవర్ గ్రిడ్, సహా బ్యాంకింగ్ స్టాక్స్ ఉన్నాయి. ఇవి సెన్సెక్స్లో అగ్రస్థానంలో నిలిచాయి. ఈ పెరుగుదలకు అమెరికా ట్రెజరీ రాబడి తగ్గుదల కూడా తోడ్పడింది.. ఇది ఆసియా మార్కెట్లలో రిస్క్ అప్పిట్(రిస్క్ తీసుకునే ధైర్యం) మెరుగుపడ్డానికి సాయపడింది.
20 శాతం పెరిగిన హొనస కన్స్యూమర్
కొత్త బ్రాండ్లు, ఆకర్షణీయమైన ట్రాక్ కారణంగా పెరిగిన ఆదాయ అంచనాలతో విస్తృత మార్కెట్లో హొనస కన్స్యూమర్ షేర్లు ఇవాళ ఏకంగా 20 శాతం పెరిగాయి.
ఫార్మా బక్స్ ట్రెండ్, సన్ ఫార్మా లాగ్స్
ఫార్మా ఇండెక్స్ 0.5 శాతం క్షీణించి, నష్టాల్లో ముగిసింది. ముఖ్యంగా సన్ ఫార్మా షేర్లు ఇవాళ నష్టపోయాయి. కంపెనీ వృద్ధి ఆశాజనకంగా లేకపోవడం, ఆదాయాలపై ఆందోళనలతో 3.3 శాతం పడిపోయింది సన్ ఫార్మా. ఫార్మా ఇండెక్స్లో ఇదే అధిక మొత్తంలో పతనమైన స్టాక్.
ప్రపంచ మార్కెట్లలో రికవరీ దేశీయ ఈక్విటీలలో పెరుగుదలకు కారణమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెచ్చిన కొత్త పన్ను కోత బిల్లు(New Tax Cut Bill) ఆమోదం పొందిన తరువాత, యుఎస్ ట్రెజరీ రాబడి తగ్గడం, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ఉపశమనం కలిగించింది. దీంతో మునుపటి సెషన్లో భారీ తగ్గుదల తర్వాత జపాన్ సూచీ ఇవాళ 0.4 శాతం పెరిగింది.
ఈ వారంలో నష్టాల్లో ముగిసిన సూచీలు
ఇవాళ బౌన్స్ బ్యాక్ అయినప్పటికీ , రెండు బెంచ్మార్క్లు(నిఫ్టీ, సెన్సెక్స్) దాదాపు ఒక శాతం వారపు నష్టాలను నమోదు చేశాయి. ఎందుకంటే.. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుండి డబ్బును ఉపసంహరించుకోవడం కొనసాగించారు. గురువారం ఒక్క రోజే ఎఫ్పిఐలు రూ.5,000 కోట్లకు పైగా ఈక్విటీలను అమ్మేసి సొమ్ము చేసుకున్నారు.
ఇవీ చదవండి:
బాబోయ్ మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
సరికొత్త రికార్డు స్థాయికి బిట్కాయిన్ ధర.. ఎంతకు చేరిందో తెలుసా..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి