Share News

Salary Scam: రూ.230 కోట్ల జీతాల స్కాం.. ఆర్నెళ్లుగా ఉద్యోగులకు నో సాలరీ..

ABN , Publish Date - Jun 06 , 2025 | 03:49 PM

50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు (salary scam) రావడం లేదు. అవును, మీరు చదివింది నిజమే. ఈ క్రమంలో ప్రభుత్వం రూ. 230 కోట్ల మేర స్కాం చేసిందని పలువురు అంటున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Salary Scam: రూ.230 కోట్ల జీతాల స్కాం.. ఆర్నెళ్లుగా ఉద్యోగులకు నో సాలరీ..
Salary Scam Madhya Pradesh

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం (salary scam) ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆరు నెలలు దాటినా కూడా వారికి మాత్రం జీతాలు రావడం లేదని వాపోతున్నారు. ఇంతకాలం దాచిపెట్టిన ఈ విషయం మే 23, 2025న, ఆర్థిక శాఖ కమిషనర్ భాస్కర్ లక్షర్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ (CTA)కి పంపిన లేఖ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో ఆగస్టు 2024 నుంచి డిసెంబర్ 2024 మధ్య, ఉద్యోగులు ఆరు నెలలుగా అందుకోలేకపోయిన జీతాల వివరాలు ఉన్నట్లు వెల్లడించారు.


కారణమిదేనా..

మేము ఈ జీతాల వ్యత్యాసాలను కనుగొనడానికి డేటా విశ్లేషణ తరచుగా చేస్తామని, కానీ ఈసారి గుర్తించిన లోపం వల్ల జీతాలు ఆయా ఖాతాల్లో చెల్లించబడలేదన్నారు. ఇప్పుడు దీనిపై విచారణ జరుగుతుందని ఆర్థిక శాఖ కమిషనర్ భాస్కర్ లక్షర్ తెలిపారు. దీని కోసం ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IFMIS) ఉందని, ఇది అన్ని ప్రభుత్వ విభాగాల ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేస్తుందన్నారు. అయితే, ఈ వ్యవస్థలోని కొన్ని తప్పిదాలు వల్ల, అనేక మంది ఉద్యోగుల వివరాలు ధృవీకరణ కాలేదన్నారు.


చర్యలకు ఆదేశం..

దీనిపై మధ్యప్రదేశ్ ఆర్థిక మంత్రి దేవదాస్ స్పందించారు. ప్రస్తుతం 50,000 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదన్నారు. ఏం జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నామని, దీనిపై బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సంఘటన గురించి సమాచారం వచ్చిన వెంటనే ఆర్థిక శాఖ 6,000కి పైగా డీడీఓ (డిస్ట్రిక్ట్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు)ని ఆదేశించింది. వారికి ఈ ఉద్యోగుల గురించి సమాచారాన్ని సేకరించి, తనిఖీ చేయాలని తెలిపింది. 15 రోజుల్లో ఈ విచారణ పూర్తి చేయాలని సూచించింది.


సోషల్ మీడియాలో..

ఇది రాష్ట్రంలో ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన అతిపెద్ద జీతాల స్కాంగా భావించబడుతోంది. అయితే, ఈ స్కాం వెనుక ఉన్న అసలు కారణం ఏంటనే విషయాలు కూడా ఆరా తీస్తున్నారు. ఈ అంశంపై భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యవస్థలో సాంకేతిక లోపాలు, ప్రజల జీవన స్థాయిపై ప్రభావం చూపిస్తాయి. మరోవైపు ఈ స్కాం గురించి అనేక మంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.


ఇవీ చదవండి:

సెకెండ్ హ్యాండ్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇస్మార్ట్ ఆటో డ్రైవర్.. ఇతడు నెలకు రూ.8 లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో తెలిస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 06 , 2025 | 04:03 PM