Share News

Indian Stock Market Crash: ఉద్రిక్త పరిస్థితుల వేళ, భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..రూ.7 లక్షల కోట్లు మటాష్

ABN , Publish Date - May 09 , 2025 | 03:41 PM

భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల వేళ భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం (మే 9న) భారీ నష్టాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 880 పాయింట్లు, నిఫ్టీ 266 పాయింట్లు నష్టపోయింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Indian Stock Market Crash: ఉద్రిక్త పరిస్థితుల వేళ, భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..రూ.7 లక్షల కోట్లు మటాష్
Indian Stock Markets End Heavy Losses

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతంలో శుక్రవారం (మే 9న) భారీ నష్టాలను (Indian Stock Market Crash) చవిచూశాయి. ఈ నేపథ్యంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సెన్సెక్స్ 880 పాయింట్లు క్షీణించగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ 266 పాయింట్లు నష్టపోయింది. ఈ కుప్పకూలిన మార్కెట్‌లో మదుపర్లు కొన్ని గంటల్లోనే లక్షల కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు. ఈ ఘటన దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో ఆందోళనను రేకెత్తించింది.


మార్కెట్‌పై ప్రభావం

ఏప్రిల్ 2025లో జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ దాడిలో 26 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి బాధ్యత వహించినట్లు ప్రకటించింది. ఆ తర్వాత నియంత్రణ రేఖ (LoC) వెంబడి ఇరు దేశాల మధ్య సాయుధ ఘర్షణలు జరిగాయి, ఇది రెండు అణ్వాయుధ శక్తుల మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ భౌగోళిక రాజకీయ అనిశ్చితి మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత ఆస్తుల వైపు మళ్లడంతో స్టాక్ మార్కెట్ ఒత్తిడికి గురైంది.


సెన్సెక్స్, నిఫ్టీ పతనం

మే 9, 2025న ఉదయం మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా క్షీణించింది. ఈరోజు ముగిసే సమయానికి సెన్సెక్స్ 880 పాయింట్ల నష్టంతో 79,919 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 266 పాయింట్లు కోల్పోయి 24,168 వద్ద స్థిరపడింది. ఈ నష్టాలు బ్యాంకింగ్, ఐటీ, మెటల్, ఆటోమొబైల్ రంగాల్లో భారీ అమ్మకాల వల్ల సంభవించాయి. ఈ క్రమంలో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 4% కంటే ఎక్కువ క్షీణించగా, బ్యాంక్ నిఫ్టీ 3% నష్టపోయింది. దీంతో మార్కెట్లు ఒక్క రోజులోనే రూ. 7 లక్షల కోట్లకు పైగా మదుపర్ల సంపదను ఆవిరి చేశాయి. BSE మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 403 లక్షల కోట్లకు దిగజారింది.


నష్టాలకు కారణాలు

ఈ భారీ నష్టాలకు అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా భారత్-పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణలు, దౌత్యపరమైన సంక్షోభం ఇన్వెస్టర్లలో భయాందోళనలను రేకెత్తించాయి. దీంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ప్రతికూల సంకేతాలు కనిపించాయి. అమెరికా మార్కెట్లు డోజోన్స్ ఇండెక్స్ 400 పాయింట్ల క్షీణతతో ముగియడం ఆసియా మార్కెట్లపై ప్రభావం చూపింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన అమెరికా విధించిన సుంకాలు కూడా భారత ఎగుమతి రంగంపై ఒత్తిడిని పెంచాయి. ఈ సమయంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) భారత మార్కెట్ నుంచి రూ. 2,000 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లను అమ్మేసినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా తెలిపింది. ఈ అమ్మకాలు మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దిగజార్చాయి. రూపాయి విలువ కూడా డాలర్‌తో పోలిస్తే 86.80 వద్ద రికార్డు కనిష్ఠ స్థాయికి చేరుకుంది.


ఇవి కూడా చదవండి

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..

Operation Sindoor: దూకుడు పెంచిన పాక్.. మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు

Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం.. కిమ్ సపోర్టు ఎవరికి..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 09 , 2025 | 05:38 PM