Share News

Stock Market Crash: మళ్లీ భారీ నష్టాల్లో మార్కెట్లు..15 నిమిషాల్లో రూ. 5 లక్షల కోట్లు లాస్

ABN , Publish Date - Jul 31 , 2025 | 11:15 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా భారీ క్షీణతను చవిచూస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25% సుంకం విధించారనే వార్త మార్కెట్‌లో ఆందోళనను రేకెత్తించింది. దీంతో సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి.

Stock Market Crash: మళ్లీ భారీ నష్టాల్లో మార్కెట్లు..15 నిమిషాల్లో రూ. 5 లక్షల కోట్లు లాస్
Stock Market Crash

దేశీయ స్టాక్ మార్కెట్లలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎఫెక్ట్ కారణంగా సూచీలు మొత్తం దిగువకు (Stock Market Losses) పయనిస్తున్నాయి. ట్రంప్ భారతీయ దిగుమతులపై 25% సుంకం విధించనున్నారన్న వార్తలతో ఇప్పటికే సెన్సెక్స్, నిఫ్టీలు బలహీనత చూపిస్తున్న మార్కెట్లు మరింతగా ఒడిదొడుకులకు లోనయ్యాయి.

నెగటివ్ మూడ్‌

నిఫ్టీ నెలవారీ ఎక్స్‌పైరీ రోజు కావడంతో మార్కెట్‌లో ఒత్తిడి ఉన్నప్పటికీ, ట్రంప్ నిర్ణయం నెగటివ్ మూడ్‌ను మరింత పెంచేశాయి. ఈ క్రమంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఈ రోజు ట్రేడింగ్‌ను 786 పాయింట్ల నష్టంతో 80,695 వద్ద ప్రారంభించగా, నిఫ్టీ 235 పాయింట్లు కోల్పోయి 25,241 వద్ద ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా భారీ నష్టాల్లో 422 పాయింట్లు పడిపోయి 55,728 వద్ద ప్రారంభమైంది. దీంతో ఇన్వెస్టర్లు మొదటి 15 నిమిషాల్లోనే రూ. 5 లక్షల కోట్లు నష్టపోయారు.


రంగాల వారీగా క్షీణత

ఆటో, రియాల్టీ రంగాల సూచీలు అత్యంత దారుణంగా క్షీణించాయి. మీడియా, PSU బ్యాంక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. అన్ని రంగాల సూచీలు రెడ్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి. ఇది మార్కెట్‌లో ఒత్తిడిని సూచిస్తుంది. సెన్సెక్స్ 30 స్టాక్‌లలో కేవలం ఐదు మాత్రమే గ్రీన్ మార్క్‌లో ఉన్నాయి. ఎటర్నల్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, HUL, ITC స్టాక్‌లు అప్‌ట్రెండ్‌లో ఉండగా, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్, టైటాన్, M&M స్టాక్‌లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి.


కరెన్సీ మార్కెట్లో కూడా ఒత్తిడి

ఈ ప్రభావంతో రూపాయి మారకం విలువ కూడా డాలరుతో పోల్చితే 27 పైసలు క్షీణించి 87.69 వద్ద ట్రేడవుతోంది. ఇది గత ఐదు నెలల్లో అతి తక్కువ స్థాయి కావడం విశేషం. దిగుమతుల ఖర్చు పెరగడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి అంశాలు రూపాయిపై ఒత్తిడిని మరింత పెంచుతున్నాయి.


మార్కెట్‌లో ఆందోళన

ఈ భారీ క్షీణతకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25% సుంకం విధించారనే వార్త. ఈ వార్త మార్కెట్‌లో ఆందోళనను రేకెత్తించింది, దీని ప్రభావం GIFT నిఫ్టీలో 200 పాయింట్ల క్షీణతగా కనిపించింది. ఈ సుంకం విధానం భారత ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది, ముఖ్యంగా ఆటో, టెక్స్‌టైల్స్, ఫార్మా రంగాలపై.

ఈ పరిణామాలు పెట్టుబడిదారులలో అనిశ్చితిని పెంచాయి, దీని ఫలితంగా మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా ఒక్కొక్కటి 1.5% కంటే ఎక్కువ పడిపోయాయి. దీంతో ఇండియా VIX మార్కెట్‌లో భయాన్ని సూచించే ఇండెక్స్ ఏకంగా 7 శాతానికి పెరిగింది. ఇది ట్రేడర్లలో అనిశ్చితి పెరుగుతోందనే సంకేతాన్ని సూచిస్తుంది.


ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 31 , 2025 | 11:44 AM