Share News

BSNL Flash Sale: కొత్త ఫ్లాష్ సేల్ ఆఫర్.. రూ.400కు 400 జీబీ డేటా

ABN , Publish Date - Jun 28 , 2025 | 11:51 AM

మీరు తక్కువ ధరకు డేటా ప్లాన్ పొందాలని చూస్తున్నారా. అయితే దీనికి భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దీనిలో మీకు రూపాయికే 1 జీబీ డేటా (BSNL Flash Sale) లభిస్తుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

BSNL Flash Sale: కొత్త ఫ్లాష్ సేల్ ఆఫర్.. రూ.400కు 400 జీబీ డేటా
BSNL Flash Sale

భారత ప్రభుత్వానికి చెందిన టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ క్రమంలో 4G డేటాను భారీ తగ్గింపులతో అందించే కొత్త ఫ్లాష్ సేల్‌ను (BSNL Flash Sale) అధికారికంగా ప్రకటించింది. ఈ సేల్ గురించి సంస్థ తన అధికారిక సోషల్ మీడియా ఛానెల్స్ ద్వారా వివరాలను పంచుకుంది. 90,000 4G టవర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన బీఎస్ఎన్ఎల్, 2025 మధ్యలో ఒక లక్ష 4G టవర్స్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది.


ఫ్లాష్ సేల్ వివరాలు

బీఎస్ఎన్ఎల్ Xలో చేసిన పోస్ట్ ప్రకారం, ఈ ఫ్లాష్ సేల్ జూన్ 28న ప్రారంభమైంది. జూలై 1 వరకు కొనసాగుతుంది. ఈ పరిమిత కాలంలో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు కేవలం రూ. 400కి 400GB డేటాను కొనుగోలు చేయవచ్చు. అంటే ప్రతి GBకి రూ. 1 ధర పడుతుందని చెప్పవచ్చు. ఈ ఆఫర్‌ను ఆసక్తి ఉన్న కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్ లేదా బీఎస్ఎన్ఎల్ సేవా యాప్ ద్వారా పొందవచ్చు. ఈ ఫ్లాష్ సేల్ ద్వారా, బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడంతోపాటు, కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి కూడా ప్రయత్నిస్తోంది.


వినియోగదారుల సవాళ్లు

తాజా డేటా ప్రకారం బీఎస్ఎన్ఎల్ మే నెలలో 1.35 లక్షల వినియోగదారులను కోల్పోయింది. ఈ ఫ్లాష్ సేల్ సంస్థకు కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి ఒక కొత్త నిర్ణయంగా చెప్పవచ్చు. వినియోగదారులకు మెరుగైన కనెక్టివిటీని అందించడానికి బీఎస్ఎన్ఎల్ లక్ష కొత్త మొబైల్ టవర్స్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉంది. వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి, బీఎస్ఎన్ఎల్ 13,000 కోట్ల రూపాయల పైగా పెట్టుబడులు పెట్టి కొత్త టవర్స్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. అదనంగా, సంస్థ హైదరాబాద్‌లో 5G ఫిక్స్డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) సేవను ప్రారంభించింది. దక్షిణ భారతదేశంలోని బెంగళూరు సహా అనేక నగరాల్లో దీన్ని విస్తరించడానికి ప్లాన్ చేస్తున్నారు.


లక్ష కొత్త టవర్స్

బీఎస్ఎన్ఎల్ తన నెట్‌వర్క్ కవర్‌ను మెరుగుపరచడానికి, యూనియన్ కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత లక్ష కొత్త 4G, 5G మొబైల్ టవర్స్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. గత సంవత్సరం, ఈ సంస్థ టవర్స్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఇప్పటివరకు 70,000 పైగా టవర్స్‌ను విజయవంతంగా ప్రారంభించింది. ఇవి పూర్తయిన తర్వాత, బీఎస్ఎన్ఎల్ ఆయా ప్రాంతాల్లో కనెక్టివిటీని గణనీయంగా పెంచుకోవడానికి సిద్ధమవుతోంది.


ఇవీ చదవండి:

సిబిల్ స్కోర్ కారణంగా ఉద్యోగం తొలగింపు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు


జూన్ 30లోపు ముగియాల్సిన ఆర్థిక కార్యకలాపాలు ఇవే..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 28 , 2025 | 11:51 AM