Black Ink Banned: చెక్కులపై బ్లాక్ ఇంక్ నిషేధమా.. నిజం ఏంటంటే..
ABN , Publish Date - Jan 18 , 2025 | 02:51 PM
చెక్కులపై బ్లాక్ పెన్నుతో రాయడం నిషేధమని ఆర్బీఐ చెప్పిందా. సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న వార్తలో నిజం ఏంటి, అధికారులు ఏం చెప్పారనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఓ వార్త ఎక్కువగా చెక్కర్లు కోడుతోంది. అది ఏంటంటే "చెక్కులు రాయడానికి బ్లాక్ ఇంక్ (Black Ink Banned) నిషేధించబడిందని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త ఆదేశాలను జారీ చేసిందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తను సోషల్ మీడియాలో అనేక మంది ఫార్వర్డ్ చేస్తున్నారు. అయితే ఈ వాదన నిజమేనా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిజంగా ఆదేశాలు జారీ చేసిందా లేదా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఆర్బీఐ ఆదేశాలు, నిజాలు
దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ చేసి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి చెక్కులు రాయడానికి నిర్దిష్ట రంగులు వినియోగించాలంటూ ఎటువంటి ఆదేశాలు రాలేదని స్పష్టం చేసింది. ఈ వాదన తప్పుడు సమాచారమని చెప్పింది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నలుపు సిరా వాడకంపై నిషేధం ఉందని చెప్పడం దుష్ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు. బ్యాంకులు సహా అన్ని ప్రభుత్వ సంస్థలు చెక్కులపై నలుపు లేదా నీలం రంగు సిరా వాడవచ్చని అన్నారు. ఎందుకంటే ఇవి స్పష్టతను అందిస్తాయని, చదవడానికి సౌలభ్యంగా ఉంటాయన్నారు.
ఏ రంగు సిరా వాడాలి?
ఇలాంటి విషయాలను నిజం తెలుసుకోకుండా షేర్ చేయకూడదని PIB వెల్లడించింది. దీంతోపాటు చెక్కులపై బ్లాక్ ఇంక్ లేదా నిర్దిష్ట రంగులు ఉపయోగించాలని ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని ఆర్బీఐ కూడా తెలిపింది. సాధారణంగా బ్యాంకింగ్ పద్ధతిలో నీలం లేదా నలుపు సిరా వాడడం మంచిది. ఇది రాసే క్రమంలో స్పష్టతను పెంచుతుంది. నీలం సిరా ఎక్కువగా ప్రత్యేకంగా నిలుస్తుంది, కాబట్టి దీనిని ఎక్కువగా వినియోగిస్తారు. అయితే ఎరుపు సిరాను మాత్రం ఉపయోగించడం నిరోధించబడింది. ఎందుకంటే ఇది అనధికారికంగా పరిగణించబడుతుంది. దిద్దుబాటును తప్పుగా అర్థం చేసుకోవచ్చు. పెన్సిల్ లేదా తుడిచిపెట్టగలిగే సిరా వాడకాన్ని కూడా పూర్తిగా నిషేధించారు. ఎందుకంటే అవి సులభంగా మార్చే వీలు ఉంటుంది.
బ్యాంకింగ్ విధానాలు, సిఫార్సులు
ఇప్పటికే ప్రకటించినట్లు బ్యాంకులు సాధారణంగా నల్ల సిరా లేదా నీలం సిరా వాడేలా చెక్కులపై ప్రతిపాదనలను రూపొందించాయి. వీటిని అనుసరించి వినియోగదారులు వ్యక్తిగతంగా రాసిన సమాచారాన్ని వేరుచేసేలా చెక్కులు రూపొందించబడతాయి. ఈ విధానం వివిధ బ్యాంకింగ్ విధానాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న ఈ సమాచారం పట్ల ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. ఇట్లాంటి పుకార్లకు సంబంధించిన విషయాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయాలని, PIB, RBI వంటి అధికారిక వర్గాల నుంచి వచ్చిన సమాచారం మాత్రమే విశ్వసించాలని కోరారు.
ఇవి కూడా చదవండి:
SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి
Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Read More Business News and Latest Telugu News