Share News

YCP Sarpanch Controversy: సర్పంచ్ వేధింపులు.. ప్రాణహానీ అంటూ మహిళ ఫిర్యాదు

ABN , Publish Date - May 26 , 2025 | 04:14 PM

YCP Sarpanch Controversy: ఓ మహిళ పట్ల వైసీపీకి చెందిన సర్పంచ్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ వైసీపీ సర్పంచ్‌పై ఓ మహిళ ఆరోపణలు చేసింది

YCP Sarpanch Controversy: సర్పంచ్ వేధింపులు.. ప్రాణహానీ అంటూ మహిళ ఫిర్యాదు
YCP Sarpanch Controversy

ఏలూరు, మే 26: వైసీపీ సర్పంచ్ వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైసీపీ (YSRCP) అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలు ఎన్నో దారుణాలకు పాల్పడ్డారు. భూకబ్జాలు, దాడులు, ప్రశ్నిస్తే జైలుకు పంపడాలు వంటి అనేక చర్యలకు తెగబడ్డారు. గత వైసీపీ నేతల తీరుతో ప్రజలు ఎంతో విసిగెత్తిపోయిన పరిస్థితి. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయి... కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోంది. కానీ అధికారం కోల్పోయినప్పటికీ కొన్ని చోట్ల వైసీపీ నేతల ఆగడాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.


ఇలాంటి వారి పట్ల కొందరు పోలీసులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరించడం కూడా అనేక విమర్శలకు తావిస్తోంది. తాజాగా ఓ మహిళ పట్ల వైసీపీకి చెందిన సర్పంచ్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ వైసీపీ సర్పంచ్‌పై ఓ మహిళ ఆరోపణలు చేసింది. ఏలూరు రూరల్ మండలం చాటపర్రు గ్రామ సర్పంచ్ గుడిపూడి రఘు గత కొన్నాళ్లుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని మహిళ ఆరోపించింది. సర్పంచ్ రఘుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సర్పంచ్ విషయంలో తనకు న్యాయం చేయకపోతే పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటానంటూ సదరు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

TDP Mahanadu 2025: పారపట్టి మట్టి పనులు చేసిన మంత్రి


ఈరోజు (సోమవారం) ఏలూరు ఎస్పీ కార్యాలయం ఎదుట పెట్రోల్ బాటిల్‌తో మహిళ ఆందోళనకు దిగింది. తన పట్ల సర్పంచ్‌ వ్యవహరించిన తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని తెలిపింది. పైగా పోలీసులు కూడా వైసీపీ నేతకే వత్తాసు పలుకుతున్నారంటూ ఆరోపించింది. ఏలూరు జిల్లా కలెక్టర్‌‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేదని వెల్లడించింది. పెట్రోల్‌ బాటిల్‌తో ఆందోళనకు దిగిన మహిళను అక్కడ ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే ఎస్పీ వద్దకు ఆమెను తీసుకెళ్లారు. వైసీపీ సర్పంచ్ నుంచి ప్రాణహానీ ఉందంటూ జిల్లా ఎస్పీకి బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని మహిళ కోరింది.


ఇవి కూడా చదవండి

మళ్లీ అనారోగ్యం.. జీజీహెచ్‌కు వల్లభనేని వంశీ

పారపట్టి మట్టి పనులు చేసిన మంత్రి

Read Latest AP News And Telugu News

Updated Date - May 26 , 2025 | 05:04 PM