Share News

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

ABN , Publish Date - May 16 , 2025 | 03:34 PM

Vamsi Remand News: మాజీ ఎమ్మెల్యే వంశీని కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నూజివీడు కోర్టు వంశీకి ఈనెల 29 వరకు రిమాండ్ విధించింది.

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్
Vamsi Remand News

ఏలూరు, మే 16: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి (Vallabhaneni Vamsi) నూజివీడు కోర్టు రిమాండ్‌లో మరో రిమాండ్ విధించింది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుకు సంబంధించి ఈరోజు (శుక్రవారం) జడ్జి కే శ్రావణి ముందు వంశీని పోలీసులు హాజరుపర్చారు. ఈ కేసులో వంశీకి ఈ నెల 29 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఇదే కేసులో వంశీతో పాటు ఆయన ప్రధాన అనుచరడు ఓలుపల్లి మోహన్ రంగారావుకు కూడా రిమాండ్ విధించారు. మరోవైపు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీపై పీటీ వారెంట్‌కు నూజివీడు కోర్టు అనుమతి ఇచ్చింది. వంశీకి 29 వరకు, మోహన రంగారావుకు 14 రోజుల పాటు నూజివీడు కోర్టు రిమాండ్ విధించింది.


కాగా... వంశీని కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా వ్యవహరించిన వైనంపై వంశీపై వరుసగా కేసులు నమోదు అవడంతో పాటు రిమాండ్ ఖైదీగా జిల్లా జైలులో కొనసాగుతున్నారు. ఇప్పటికే అతడు గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసులో 71వ నిందితుడిగా ఉన్నారు. ఆ కేసు నుంచి బయటపడేందుకు ఫిర్యాదుదారుడు సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో ఏ1గా ఉన్నారు. మరోవైపు భూకబ్జా కేసుకు సంబంధించి వంశీపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసుపై దాదాపు 90 రోజుల విచారణ సాగింది. ఆ రెండు కేసుల్లో ఇప్పటికే వంశీకి బెయిల్ మంజూరు అయ్యింది. ఈరోజు విజయవాడ సీఐడీ కోర్టులో టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి తీర్పు వెలువడనుంది. ఈ కేసులో బెయిల్ మంజూరు అవుతుందా, లేక డిస్మిస్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం


ఈ పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు వంశీపై కేసు నమోదు అయ్యింది. దీనికి సంబంధించి నిన్న (గురువారం) నూజివీడు కోర్టులో పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీనిపై కోర్టులో హాజరుపర్చాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు ఉదయం విజయవాడ జిల్లా జైలులో ఉన్న వల్లభనేని వంశీని , ఆయన అనుచరుడు రంగాను నూజివీడు కోర్టులో హాజరుపర్చారు. కేసు విచారణ జరుగగా ఈనెల 29 వరకు వంశీకి రిమాండ్ విధించారు. దీంతో అతడిని తిరిగి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు వంశీపై గన్నవరం పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదు అయ్యింది. కొండపాలూరులో అక్రమ క్వారీ గ్రావెల్ తవ్వకాలపై కేసు నమోదు చేశారు పోలీసులు. వంశీ, అతని అనుచరులపై కేసు నమోదైనట్టు సమాచారం.


ఇవి కూడా చదవండి

SIT Investigation: రెండో రోజు సిట్ కస్టడీకి సజ్జల శ్రీధర్

Tirumala Donations: గోవిందుడికి భారీ కానుక

Read Latest AP News And Telugu News

Updated Date - May 16 , 2025 | 03:38 PM