Share News

Botsa Satyanarayana:‘శ్మశానం’ అని సభ ఎలా పెట్టారు?

ABN , Publish Date - Mar 04 , 2025 | 06:00 AM

శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల మంటలు రేగాయి. మంత్రి అచ్చెన్నాయుడు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల తూటాలు పేలాయి.

 Botsa Satyanarayana:‘శ్మశానం’ అని సభ ఎలా పెట్టారు?

  • అమరావతిపై బొత్సకు అచ్చెన్న సూటి ప్రశ్న

  • శ్మశానం అన్నాను.. ఆ సందర్భం వేరు: బొత్స

  • మీరు కాటికాపరా?: పంచుమర్తి అనురాధ

అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల మంటలు రేగాయి. మంత్రి అచ్చెన్నాయుడు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల తూటాలు పేలాయి. తొలుత టీడీపీ శాసనమండలి చీఫ్‌ విప్‌ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ.. రాజధాని అమరావతిని బొత్స సత్యనారాయణ గతంలో శ్మశానంతో పొల్చారని అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇదే విషయాన్ని సూటిగా ప్రశ్నించారు. దీనిపై బొత్స వివరణ ఇస్తూ.. అప్పటి సందర్భం వేరని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానులను తమ విధాన నిర ్ణయంగా తీసుకున్నట్టు చెప్పారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి లేకపోవడం వల్ల వల్లకాడులా మరిందని, అక్కడికి వెళ్లి మీరు ఏం చేయాలని తాను మంత్రిగా మాట్లాడింది వాస్తమమన్నారు. రాగద్వేషాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని, అధికార పార్టీకే పని చేయాలని సాక్షాత్తు సీఎం చంద్రబాబు మాట్లాడడం మాట్లాడడం సరైందికాదన్నారు. రుషికొండలో అవినీతి జరిగిందంటున్నారని, అలాంటప్పుడు రుషికొండలో భవనాలు కట్టిన కాంట్రాక్టర్‌కు రూ.80 కోట్లు ఎందుకు చెల్లించారో చెప్పాలని బొత్స డిమాండ్‌ చేశారు. రుషికొండలో అవినీతి అక్రమాలు జరిగితే విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ‘‘ఎమ్మెల్యే అయ్యావ్‌. మంత్రివి అయ్యావ్‌. ఇంకా కావడానికి ఏం మిగల్లేదు’’ అని మంత్రి అచ్చెన్నాయుడును ఉద్దేశించి అన్నారు.


మోసం చేశారు: అచ్చెన్న

రాజధాని అమరావతిలో భవనాలను తాము ఎప్పుడూ తాత్కాలికమని చెప్పలేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శాశ్వత భవనాలు నిర్మించే వరకు వీటిని వాడుకుంటామని తెలిపినట్టు చెప్పారు. ‘‘రాజధానిని శ్మశానం అన్న పెద్దమనిషిని.. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం’’ అన్నారు. శ్మశానం అని ఇదే భవనంలో సభలు సమావేశాలు నిర్వహించారన్నారు. అమరావతికి మద్దతు తెలిపి అధికారంలోకి వచ్చాక రాజధానికి మోసం చేశారని మంత్రి మండిపడ్డారు. అమరావతిలో చదరుపు అడుగుకు రూ.10 వేలు చెల్లించామంటూ ఆరోపణలు చేస్తున్నారని, విశాఖలో వైసీపీ పాలనలో రుషికొండలో భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.26 వేలు ఎలా ఖర్చు చేశారని నిలదీశారు. రాజధాని అమరావతి ఒక సామాజికవర్గం కోసం కట్టారంటూ వైసీపీ దుష్ప్రచారం చేసిందన్నారు. కాగా, రాజధానిని శ్మశానం అన్నారు.. మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరు? అని పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. ‘‘అమరావతి శ్మశానం అయితే మీరు కాటికాపరా?’’ అని బొత్స సత్యనారాయణను ప్రశ్నించారు.

Updated Date - Mar 04 , 2025 | 06:01 AM