Vizianagaram Terror Case: ఉగ్ర కుట్రలు.. రహస్య విచారణకు సన్నద్ధం
ABN , Publish Date - May 23 , 2025 | 09:50 AM
Vizianagaram Terror Case: ఉగ్రలింకుల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సిరాజ్, సమీర్లను పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయనగరం కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయనగరం పోలీసులు.. విశాఖ సెంట్రల్ జైలులో ఉన్న ఏ1, ఏ2 సీరజ్, సమీర్లను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.

విజయనగరం, మే 23: విజయనగరం ఉగ్ర లింకుల కేసులో (Vizianagaram Terror Case) దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. ఉగ్ర లింకులతో సంబంధాలున్న సిరాజ్, సమీర్లను వారం రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. సిరాజ్, సమీర్లు విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. నిన్న (గురువారం) రాత్రి 10:30 నిమిషాలకు విజయనగరం పోలీసులకు సిరాజ్, సమీర్ల పోలీస్ కస్టడీ అనుమతుల పేపర్స్ అందడంతో ఈరోజు (శుక్రవారం) ఉదయాన్నే సెంట్రల్ జైలుకు విజయనగరం పోలీసులు చేరుకున్నారు. ఈ కేసులో ఏ1 సిరాజ్, ఏ2 సమీర్లను రహస్య ప్రదేశంలో విచారించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. రెండు వాహనాల్లో విశాఖ సెంట్రల్ జైలుకు వచ్చారు విజయనగరం పోలీసులు. సిరాజ్, సమీర్లను సెంట్రల్ జైలు నుంచి పోలీసులు కస్టడీకి తీసుకున్న వెంటనే ఎన్ఐఏ విచారం చేపట్టనుంది. మరోవైపు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ విజయనగరం చేరుకుంది. ఉగ్ర కుట్రలకు సంబంధించి పలు అంశాలపై ఎన్ఐఏ బృందాలు సమగ్రంగా పరిశీలన చేస్తున్నాయి.
ఉగ్రలింకుల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సిరాజ్, సమీర్లను పోలీస్ కస్టడీకి ఇస్తూ నిన్న (గురువారం) విజయనగరం కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయనగరం పోలీసులు.. విశాఖ సెంట్రల్ జైలులో ఉన్న ఏ1, ఏ2 సీరజ్, సమీర్లను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. వీరిరువురినీ పోలీసు కస్టడీలోకి తీసుకున్న వెంటనే సమగ్రమైన సమాచారం వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. వీరు పేలుళ్లకు ఎక్కడెక్కడ కుట్ర పన్నారు, వీళ్ల ఆర్థిక మూలాలు ఏంటి, ఎవరెవరితో వీరికి లింకులు ఉన్నాయి, వీరువురువురూ కాకుండా విజయనగరం, హైదరాబాద్లో ఇంకా ఎవరైనా ఉన్నారా, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వారు సిగ్నల్ యాప్ ద్వారా ఏ విధమైన నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నారన్న ప్రాథమిక సమాచారం ఇప్పటికే ఎన్ఐఏ, తెలంగాణ నిఘా వర్గాల వద్ద ఉంది.
అయినప్పటికీ వీరిరువురి నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని.. సిరాజ్, సమీర్లను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. రెండు రోజులు పాటు వాదనలు జరుగుగా.. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సిరాజ్, సమీర్లను ఏడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ ఏడురోజుల్లో నిందితులకు థర్డ్ డిగ్రీ ఉపయోగించవద్దని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు ముగిసిన తర్వాత కోర్టులో హాజరుపరిచి, వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సెంట్రల్ జైలుకు అప్పగించాలని కోర్టు స్పష్టం చేసింది. ఇక సిరాజ్, సమీర్ పోలీసు కస్టడీకి వచ్చిన తర్వాత పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు, పోలీసులు భావిస్తున్నారు. వీరిని రహస్య ప్రదేశంలో విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఇవి కూడా చదవండి
Read Latest AP News And Telugu News