NIA Investigation: ఉగ్ర కుట్రపై రెండో రోజు ఎన్ఐఏ దర్యాప్తు
ABN , Publish Date - May 20 , 2025 | 10:47 AM
NIA Investigation: ఉగ్ర కుట్రపై ఎన్ఐఏ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ, పోలీస్ అధికారులు కలిసి సోదాలు చేపట్టారు.

విజయనగరం, మే 20: జిల్లాలో ఎన్ఐఏ అధికారుల (NIA Officers) దర్యాప్తు రెండో రోజు కొనసాగుతోంది. ఎన్ఐఏ అధికారులు, డీఎస్పీ, అడిషన్ ఎస్పీ స్థాయి పోలీస్ అధికారులతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. వీరంతా కలిసి విజయనగరం జిల్లాలోని (Vizianagaram District) పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్ర లింకులతో సంబంధం ఉన్న సిరాజ్ కుటుంబసభ్యులు, స్నేహితులను ప్రత్యేక బృందాలు ప్రశ్నిస్తున్నాయి. సిరాజ్ వినియోగించిన సెల్ ఫోన్ కాల్ డేటాతో మరింత లోతైన దర్యాప్తు జరుగుతోంది.
సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్ ఇరువురూ ఒక టీంలా ఏర్పడి దేశంలోని కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్న మరికొంత మందిని కలుపుకుని ఏ విధంగా బాంబులు తయారు చేయాలి, అమేజాన్ ద్వారా టిఫిన్ బాక్సులు, వైర్లు తెప్పించుకుని బాంబులు ఏ రకంగా పెట్టాలి, జనసాంద్రత ఎక్కడెక్కడ ఉంటుందనే దానిపై రిహార్సల్స్ చేయడానికి సంబంధించి ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు పూర్తి స్థాయిలో సమాచారాన్ని రాబట్టారు. మిగిలిన సమాచారం కోసం సిరాజ్ కుటుంబసభ్యులు, స్నేహితులను ప్రశ్నిస్తూ మరింత సమాచారాన్ని రాబట్టే పనిలో పడింది ఎన్ఐఏ. ఇదిలా ఉండగా.. వీరు ఇరువురిని వారం రోజులపాటు పోలీసు కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. ఈ పిటిషన్ ఈరోజు (మంగళవారం) న్యాయస్థానం ముందు విచారణకు వచ్చే అవకాశం ఉంది. కోర్టు తీర్పును అనుసరించి విశాఖ సెంట్రల్ జైలులో ఉన్న సిరాజ్, సమీర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. ఎంతో రహస్యంగా ఎన్ఐఏ, పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నారు.
CM Chandrababu: టంగుటూరి ప్రకాశం పంతులు సాహసం ఎన్నటికీ మరువలేం..
గత ఆరు నెలల్లో సిరాజ్ మూడుసార్లు సౌదీ వెళ్లాడు. అయితే సౌదీ వెళ్లేందుకు ఇంట్లో ఏమని చెప్పాడు, సౌదీలో ఎవరిని కలిశాడు, సౌదీ వెళ్లేందుకు డబ్బులు ఎలా వచ్చాయి, సిరాజ్కు చెందిన అకౌంట్లో డబ్బులు ఏమైనా జమ అయ్యాయా.. వస్తే ఎవరి వద్ద నుంచి వచ్చిందనే వివరాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. సిరాజ్, సమీర్తో పాటు మరో నలుగురు ఒక టీంగా ఏర్పడి.. హైదరాబాద్లో మూడు రోజులపాటు మకాం వేసినట్లు పోలీసులు గుర్తించారు. వారి సమావేశంలో ఏ విషయాలు చర్చించారనే దానిపై ఎన్ఐఏ అధికారులు కూపీలాగనున్నారు. వీరికి సంబంధించి ఎక్కువ సమాచారం ఎన్ఐఏ అధికారుల వద్ద ఉన్నప్పటికీ మరింత సమాచారం కోసం వీరిద్దరినీ కస్టడీలోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక.. పేలుళ్ల కుట్రకు వ్యూహాలు రచించిన సిరాజ్, సమీర్పై చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం, పేలుడు పదార్థాల చట్టం, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. విజయనగరం కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం సిరాజ్, సమీర్ విశాఖ జైలులో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
JN.1 COVID 19 Variant: కొవిడ్ కేసుల పెరుగుదల.. ఏమిటీ జేఎన్.1 కరోనా వేరియంట్
US: అమెరికా కీలక నిర్ణయం.. నిబంధనలు ఉల్లంఘించిన భారతీయ ట్రావెల్ ఏజెంట్లపై ఆంక్షలు
Read Latest AP News And Telugu News