Car door locked: ద్వారపూడిలో కారు డోర్ లాక్.. నలుగురు పిల్లలు ఊపిరాడక మృతి
ABN , Publish Date - May 18 , 2025 | 07:26 PM
నలుగురు చిన్నపిల్లలు ఆడుకుంటూ కారులోకి ఎక్కి కూర్చొని డోర్ వేసుకున్నారు. తర్వాత కారు డోర్ తీసేందుకు చిన్నారులు ప్రయత్నించినా వాళ్లకి వీలు కాలేదు. డోర్ ఆటోమెటిక్ లాక్ కావడంతో ఊపిరాడక చివరికి తుదిశ్వాస వదిలారు.

విజయనగరం: విజయనగరం మండల పరిధి ద్వారపూడిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారులో డోర్ వేసుకుని ఉన్న నలుగురు పిల్లలు ఊపిరాడక మృతి చెందారు. చిన్నారుల మృతదేహాలను మహారాజ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారులు కంది మనేశ్వరి (6), బూర్ల చారులత(7), బూర్ల జాస్రిత (8), పంగి ఉదయ్ (7) ఆడుకుంటూ కారులోకి ఎక్కి కూర్చొన్నారు. తర్వాత కారు డోర్ తీసేందుకు చిన్నారులు ప్రయత్నించినా వాళ్లకి వీలు కాలేదు. డోర్ ఆటోమెటిక్ లాక్ పడడంతో చిన్నారులు ఊపిరాడక తుదిశ్వాస వదిలారు. ఈ ఘోరమైన ఘటనతో గ్రామమంతా విషాదం నెలకొంది. పిల్లల తల్లిదండ్రులతోపాటు, వాళ్ల బంధువులు, ఊర్లోని వాళ్లు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆ క్లిష్ట సమయంలో కారులోని చిన్నారులు ఊపిరందక పడుతున్న నరకయాతనను ఎవరూ గుర్తించకపోవడంతో చివరికి ముక్కుపచ్చలారని పసివాళ్లు విగతజీవుల్లా మారిపోయారు.
ఇదిలా ఉండగా, ఏపీలోనే జరిగిన మరో రెండు ఘోర ఘటనల్లో పసివాళ్లు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లా దేవరాజపురంలో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తూ కుంటలో పడి గౌతమి(7), షాలిని(6), అశ్విన్(7) ప్రాణాలు కోల్పోయారు. ఇక, ఏలూరు జిల్లాలో జల్లేరు జలాశయం చూసేందుకు వెళ్లిన షేక్ సిద్ధిఖ్(10), అబ్దుల్(7)నీట మునిగి ప్రాణాలొదిలారు. ఇలా ఈ ఒక్కరోజులో మొత్తం తొమ్మిది మంది చిన్నారులు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి
Russian Dream Teacher: విద్యార్థితో అసభ్య ప్రవర్తన.. అలాంటి ఫొటోలు పంపి..
Fire Accident In Charminar: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. ఇలా జరిగింది..