Crime News: భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య..
ABN , Publish Date - Jun 13 , 2025 | 11:45 AM
Crime News: నందిగామ గోపీనాథ్పై పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును వెనక్కి తీసుకోవాలని భార్యను ఒత్తిడి చేశాడు. కేసు వెనక్కి తీసుకునేందుకు ఆమె తిరస్కరించింది. ఈ విషయంలో గత అర్ధరాత్రి 2:30 గంటల వరకు భార్య వెంకటలక్ష్మితో భర్త గోపినాథ్ గొడవపడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Visakha: నగరంలోని రెడ్డి కంచరపాలెంలో దారుణం చోటుచేసుకుంది. గోపీనాథ్ (Gopinath) అనే వ్యక్తి తన భార్య (Wife)ను హతమార్చి (Kill) అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. గత అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. గోపీనాథ్ భార్య తలపై ఇనుప డంబుల్ (Iron Dumbbell)తో గట్టిగా కొట్టి హతమార్చాడు. కుటుంబ కలహాల (Family Disputes) కారణంగా భార్యను హతమార్చినట్టు సమాచారం. తల్లిదండ్రులు మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.
కేసు వెనక్కి తీసుకోమంటూ..
గోపీనాథ్పై పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును వెనక్కి తీసుకోవాలని భార్యను ఒత్తిడి చేశాడు. కేసు వెనక్కి తీసుకునేందుకు ఆమె తిరస్కరించింది. ఈ విషయంలో గత అర్ధరాత్రి 2:30 గంటల వరకు భార్య వెంకటలక్ష్మితో గోపినాథ్ గొడవపడ్డాడు. ఎంతకూ ఆమె కేసు వెనక్కి తీసుకోనని మొండికేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భర్త ఇంట్లో ఉన్న డంబుల్తో ఆమె తలపై కొట్టి చంపి.. మధ్య గదిలో గడియ పెట్టుకొని గోపీనాథ్ కూడా ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కంచరపాలెం పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమదు చేసి దర్యాప్తు చేపట్టారు.
డబ్బుల విషయంలో భార్య భర్తల మధ్య గొడవ..
విశాఖలోని రెడ్డి కంచరపాలెంలో గోపీనాథ్ (42), వెంకటలక్ష్మి (39) భార్యా భర్తలు నివాసముంటున్నారు. గోపీనాథ్ పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తెచ్చిన డబ్బులను కుటుంబ అవసరాలకు ఇవ్వకుండా, చెడు అలవాట్లకు ఖర్చు చేస్తుండడంతో.. డబ్బుల విషయంలో భార్య వెంకటలక్ష్మి భర్తతో గొడవ పడేది. అయినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. దీంతో వెంకటలక్ష్మి కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఇటీవల ఫిర్యాదు చేసింది. తన భర్త తనను వేధిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని.. తనకు న్యాయం చేయాలని కోరింది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. భార్యతో గొడవపడేవాడు. నిన్న అర్ధరాత్రి ఇద్దరి మధ్య గొడవ మరింత తీవ్రమైంది. తనపై పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసును, వెనక్కి తీసుకోవాలని భార్యపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె తిరస్కరించింది. దీంతో గోపీనాథ్ తీవ్ర ఆగ్రహానికి గురై.. ఇంట్లో ఉన్న డంబుల్తో ఆమె తలపై కొట్టడంతో ఆమె చనిపోయింది. ఆ వెంటనే గోపీనాథ్ కూడా ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కంచరపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ప్రధాని మోదీ..
విమాన ప్రమాదంపై మృత్యుంజయుడు ఏమన్నారంటే..
For More AP News and Telugu News