Somu Veerraju: ఇంకా పెద్ద సినిమా ఉంది.. యుద్ధాన్ని ఆపలేదు..
ABN , Publish Date - May 14 , 2025 | 02:07 PM
Somu Veerraju: కుహానా రాజకీయ నేతల వలన దేశానికి నష్టమని.. వాళ్లు అద్దె మైకులలాంటివారని, భారతీయులు కాదని.. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు.సెక్యులర్ విధానాన్ని అడ్డం పెట్టుకొని దేశాన్ని దెబ్బ తీయాలని కొందరు చూస్తున్నారు అన్నారు.

విశాఖ: మాజీ ఎంపీ (Ex MP) విజయ సాయి రెడ్డి (Vijayasai Reddy) బీజేపీ (BJP)లో చేరతారన్న వార్తలపై స్పందించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు (MLC Somu Veerraju) కీలక వ్యాఖ్యలు (Key comments) చేశారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన విశాఖ (Visakha)లో మీడియాతో మాట్లాడారు.. గతంలో వైసీపీ (YCP).. టీడీపీ (TDP) తమ తమ పార్టీలలో చేర్చుకున్న వారికి మంత్రి పదవులు ఇచ్చారని.. అప్పుడు ప్రశ్నించని వారు ఇప్పుడు తమ పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. విజయసాయి రెడ్డి బీజేపీలో చేరతారా.. లేదా అనేది తన దృష్టిలో లేదని.. ఒకవేళ ఎవరైనా బీజేపీలో జాయిన్ అయితే ఆ ముహూర్తాలు మీకు చెబుతామా అని సోము వీర్రాజు అన్నారు.
Also Read: శ్రవణ్ రావును విచారిస్తున్న సీసీఎస్ పోలీసులు
కుహానా రాజకీయ నేతల వలన దేశానికి నష్టమని.. వాళ్లు అద్దె మైకులలాంటివారని, భారతీయులు కాదని.. సోము వీర్రాజు విమర్శించారు.సెక్యులర్ విధానాన్ని అడ్డం పెట్టుకొని దేశాన్ని దెబ్బ తీయాలని కొందరు చూస్తున్నారని అన్నారు. పాక్తో యుద్ధాన్ని విరమించామని చెప్పలేదని.. ఇంకా పెద్ద సినిమా ఉందని.. యుద్ధాన్ని ఆపలేదని అన్నారు. సినిమా అంతా ముందు ఉంటుందని.. సరైన సమయంలో యాక్షన్ ఉంటుందని అన్నారు. ప్రధాని మోదీ మదిలో అన్ని విషయాలు ఉన్నాయని.. ఎప్పుడూ ఏమి చేయాలో మోదీకి అన్ని తెలుసునని అన్నారు. పాకిస్తాన్, పీవోకేపై దాడి తర్వాత కుహానా లౌకిక వాదులు కలుగులోకి వెళ్లిపోయారన్నారు. అమెరికా ఒక మార్కెటింగ్ కంపెనీ అని... యుద్ధం ఆపమని డోనాల్డ్ ట్రంప్ చెబితే ఆగడం ఉండదని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రీన్యూ ఎనర్జీ కాంప్లెక్స్.. 16న లోకేష్ శంకుస్థాపన
పాక్ వక్రబుద్ధి.. సాంబ సెక్టార్లోకి డ్రోన్లు..
వరంగల్ పర్యటనకు మిస్ వరల్డ్ కంటెంట్స్..
For More AP News and Telugu News