Home Minister Anitha:పెనుగంచిప్రోలు ఘటనపై హోంమంత్రి సీరియస్
ABN , Publish Date - Mar 18 , 2025 | 12:24 PM
ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు తిరుణాలలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అడ్డుకున్న పోలీసు సిబ్బందిపై రాళ్లతో దాడులు చేశారు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలయ్యాయి. ఈ సంఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. ఈ దాడి ఘటనకు కారణమైన వారందరిపై కేసులు నమోదు చేయాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు హోంమంత్రి ఆదేశించారు.

ఎన్టీఆర్ జిల్లా: పెనుగంచిప్రోలు (Penuganchiprolu) లక్ష్మీ తిరుపతమ్మ (Lakshmi Tirupatamma) తిరుణాలలో జరిగిన గొడవపై హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anita) సీరియస్ (Serious) అయ్యారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు (YSRCP Activists) పోలీసులపై రెచ్చిపోయి రాళ్లతో దాడిచేయడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ పాకెట్లు, బాటిళ్లు, రాళ్లు విసిరిన ఘటనలో పోలీసులకు, భక్తులకు గాయాలయ్యాయి. ఈ దాడి ఘటనకు కారణమైన వారందరిపై కేసులు నమోదు చేయాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు హోంమంత్రి ఆదేశించారు. జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలవడంపై అతని పరిస్థితిపై ఆరా తీశారు. నందిగామ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించేలా చూడాలని ఆమె ఆదేశించారు. అదుపు చేసి రక్షించాలనుకున్న పోలీసులని చూడకుండా దాడికి దిగితే సహించబోమని హోంమంత్రి అనిత తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
Also Read..:
అమరావతిలో బిట్స్ ఏర్పాటుకు నిర్ణయం: మంత్రి లోకేష్
పూర్తి వివరాలు..
ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు తిరుణాలలో (Tirunal) వైఎస్సార్సీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అడ్డుకున్న పోలీసు (Police) సిబ్బందిపై రాళ్లతో దాడులు చేశారు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలయ్యాయి. లక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరుణాలలో తెలుగుదేశం (TDP), జనసేన (Janasena), వైఎస్సార్సీపీ (YSRCP)నేతల ఆధ్వర్యంలో ప్రభల ఊరేగింపు జరిగింది. టీడీపీకి చెందిన ప్రభ సెంటర్లో ఉండగా, వైఎస్సార్సీపీకి చెందిన ప్రభ వర్గం రెచ్చగొట్టే చర్యలకు దిగింది. వాటర్ ప్యాకెట్లు బాటిళ్లు రాళ్లు విసిరారు. ఇది గమనించిన పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు వెళ్లారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీసులపైనా రాళ్లు, వాటర్ ప్యాకెట్లు విసిరారు. ఈ ఘటనలో నలుగురు పోలీసు సిబ్బంది, ప్రజలకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. రెచ్చగొట్టేలా దాడులు చేసిన వారిపై కేసు నమోదు చేశారు.
కాగా వైఎస్సార్సీపీ శ్రేణులు ముందస్తు ప్రణాళికతోనే రెచ్చగొట్టే చర్యలకు దిగి.. పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఈ దాడిలో తెలుగుదేశం కార్యకర్తలు కూడా గాయపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మంత్రి ప్రెజెంటేషన్
యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతున్న మహిళ అరెస్టు..
Chiranjeevi: లండన్లో మెగాస్టార్ చిరంజీవి..
For More AP News and Telugu News