7th Class Girl: సెలవులకు ఇంటికెళ్తే పెళ్లి చేసేశారు
ABN , Publish Date - May 01 , 2025 | 04:51 AM
వేసవి సెలవుల్లో ఇంటికి వెళ్లిన ఏడో తరగతి బాలికను బలవంతంగా పెళ్లి చేశారు. తనను కాపాడమంటూ పాఠశాల టీచర్లను వేడుకున్న బాలికను బాలసదన్కు తరలించారు.

టీచర్ల ముందు ఏడో తరగతి బాలిక కన్నీరు
బాలసదన్కు తరలించిన ఐసీడీఎస్
కోట, రుద్రవరం, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): ‘వేసవి సెలవులకు ఇంటికి వస్తే.. బలవంతంగా పెళ్లి చేసేశారు. కన్నవాళ్లు కూడా కాపురం చేయాల్సిందే అంటున్నారు. నన్ను కాపాడండి’ అంటూ ఏడో తరగతి బాలిక పొగిలి పొగిలి ఏడుస్తూ టీచర్లను వేడుకుంది. తిరుపతి జిల్లా కోటలో ఈ ఘటన జరిగింది. కోట మండలం గూడలి సమీపంలోని కాలనీలో నివసిస్తున్న ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అక్కాచెల్లెళ్లు.. కోట గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 7,9 తరగతులు చదువుతున్నారు. వేసవి సెలవులు ఇవ్వడంతో ఏప్రిల్ 23న ఇంటికి వెళ్లారు. ఆ రాత్రే ఇద్దరికీ తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చేశారు. మరుసటి రోజే పెళ్ల్లిళ్లు చేసేసి భర్తల వెంట పంపేశారు. 30 ఏళ్ల వ్యక్తికి 7వ తరగతి బాలికను ఇచ్చి పెళ్లి చేయడంతో.. ఆ బాలిక కాపురం చేయలేనంటూ పుట్టింటికి వచ్చేసింది. తల్లిదండ్రులు ఎంత చెప్పి నా వినకుండా.. పసు పు తాడుతోనే బుధవారం గురుకుల పాఠశాలకు వెళ్లిపోయింది. తనను కాపాడమంటూ టీచర్ల కాళ్లావేళ్లా పడింది. వారు పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఐసీడీఎస్ సీడీపీఓ మునికుమారి, సూపర్వైజర్ కవిత పోలీసులకు ఫిర్యాదు చేసి, బాలికను నెల్లూరులోని బోర్డింగ్ స్కూల్ (బాలసదన్)కు తరలించారు.
Also Read:
సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్
రిటైర్మెంట్పై బాంబు పేల్చిన ధోని
ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..
For More Andhra Pradesh News and Telugu News..