Share News

TTD: 1 నుంచి జూలై 15 వరకు వీఐపీ సిఫారసు బ్రేక్‌ దర్శనాల రద్దు

ABN , Publish Date - Apr 28 , 2025 | 05:17 AM

తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో, మే 1 నుండి జూలై 15 వరకు వీఐపీ సిఫారసు లేఖలపై బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశారు. మార్పులతో, ప్రొటోకాల్‌ పరిధిలోని ప్రముఖులు మాత్రమే బ్రేక్‌ దర్శనాలు పొందుతారు

TTD: 1 నుంచి జూలై 15 వరకు వీఐపీ సిఫారసు బ్రేక్‌ దర్శనాల రద్దు

  • బ్రేక్‌ దర్శనాల సమయంలోనూ మార్పులు

తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో మే నెల 1 నుంచి జూలై 15వ తేదీ వరకు సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. స్వయంగా వచ్చే ప్రొటోకాల్‌ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే బ్రేక్‌ దర్శనాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఇక, వీఐపీ బ్రేక్‌ దర్శన సమయం మార్పు కూడా మే 1వ తేదీ నుంచి అమలుచేయనున్నారు. ప్రస్తుతం వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ఉదయం 8 గంటల నుంచి మొదలవుతున్న విషయం తెలిసిందే. అయితే గతంలో మాదిరిగా మొదటి గంట తర్వాత ఉదయం 6 గంటలకు బ్రేక్‌ దర్శనాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు

AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..

Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం

Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి

TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 05:17 AM