MP CM Ramesh: ముందుచూపుతోనే తక్కువ నష్టంతో బయటపడ్డాం..
ABN , Publish Date - Oct 31 , 2025 | 11:00 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందుచూపుతో మొంథా తుఫాను నుంచి చాలా తక్కువ నష్టంతో బయటపడ్డామని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, కుటుంబ సభ్యులతో కలిసి ఆయన గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
- ఎంపీ సీఎం రమేష్
తిరుమల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందుచూపుతో మొంథా తుఫాను నుంచి చాలా తక్కువ నష్టంతో బయటపడ్డామని ఎంపీ సీఎం రమేష్(MP CM Ramesh) అన్నారు. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, కుటుంబ సభ్యులతో కలిసి ఆయన గురువారం తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఎక్కడిక్కడ అధికారులను అప్రమత్తం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారన్నారు. అంతకుముందు ఆయన శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
తుఫానును ఆపలేం... నష్టం తగ్గించాం
Read Latest Telangana News and National News
