Nara Lokesh: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న నారా లోకేష్ ఫన్నీ కామెంట్
ABN , Publish Date - Jun 01 , 2025 | 10:14 AM
అబ్బే.. వాళ్ళేమీ మారలేదు.. వాళ్ళేమీ మారరు కూడా. ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో.. ఆ పేరును సార్ధకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు. అందుకే నాటికి, నేటికీ.. ఎప్పటికీ అదొక సైకో పార్టీ... వాళ్ళకి సైకో నాయకుడు!

ఇంటర్నెట్ డెస్క్: వైసీపీలోని చిన్నా చితకా అల్లరి మూకల్ని 'పిల్ల సైకోలు' అని ఉచ్చరించడం నారా లోకేష్ తోనే మొదలైందని చాలా మంది టీడీపీ నేతలు అంటుంటారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ పదాన్ని వాడుతూ ఒక ఫన్నీ కామెంట్ పోస్ట్ చేస్తూ వీడియోలు కూడా జోడించారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ ఏపీ మంత్రి నారా లోకేష్ ఏమన్నారో చూద్దాం..
"అబ్బే.. వాళ్ళేమీ మారలేదు..... వాళ్ళేమీ మారరు కూడా..... ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో... ఆ పేరును సార్ధకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు. అందుకే నాటికి నేటికీ ఎప్పటికీ అదొక సైకో పార్టీ... వాళ్ళకి సైకో నాయకుడు! ప్రజలు బుద్ధి చెప్పినా మారని వాళ్ళ ఆలోచనలను.... చిన్న పిల్లవాడి చేతిలో నుండి సైకిల్ లాక్కొని దాన్ని తొక్కుతూ విరగ్గొడుతూ వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలను సమాజం మరింతగా అర్థం చేసుకోవాలని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మైలవరంలో ఓ మాజీ మంత్రి ఇంట్లో శుభకార్యానికి వచ్చి వాళ్ళు చేసిన పిచ్చి చేష్టలు తీవ్రంగా ఖండిస్తున్నా." అని నారా లోకేష్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్పై నెట్టింట్లో నెటిజన్లు ఫన్నీ.. ఫన్నీగా వింతైన కామెంట్స్ చేస్తున్నారు.