Srisailam Dam: శ్రీశైలం గేట్లు మూసివేత ఎగువ నుంచి తగ్గిన వరద ప్రవాహం
ABN , Publish Date - Aug 04 , 2025 | 05:12 AM
ఎగువ నుంచి శ్రీశైలం డ్యాంకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో జలాశయంలోని అన్ని గేట్లను ఆదివారం మూసేశారు.

నంద్యాల, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ఎగువ నుంచి శ్రీశైలం డ్యాంకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో జలాశయంలోని అన్ని గేట్లను ఆదివారం మూసేశారు. జూరాల, సుంకేసుల నుంచి 1,26,420 క్యూసెక్కుల వరద శ్రీశైలంలోకి వస్తోంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ద్వారా 66,297 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.10 అడుగులకు చేరింది. 199.27 టీఎంసీల నీరుంది.
చివరి సి-295 భారత్కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్
తేజస్వి యాదవ్కు ఎన్నికల కమిషన్ నోటీసు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి