Share News

Human Rights Group: కేశవరావు మృతదేహాన్ని తీసుకురానివ్వకుండా శ్రీకాకుళం ఎస్పీ అడ్డంకులు

ABN , Publish Date - May 26 , 2025 | 04:21 AM

నంబాల కేశవరావు మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి శ్రీకాకుళం ఎస్పీ అడ్డంకులు సృష్టిస్తున్నారని పౌరహక్కుల సంఘం ఆరోపించింది. ఈ మేరకు వారు సీఎం, హోంమంత్రికి లేఖ రాశారు.

Human Rights Group: కేశవరావు మృతదేహాన్ని తీసుకురానివ్వకుండా శ్రీకాకుళం ఎస్పీ అడ్డంకులు

  • సీఎం, హోంమంత్రికి పౌరహక్కుల సంఘం లేఖ

విజయవాడ, మే 25(ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్ల లో గత వారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావు మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురానివ్వకుండా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి అడ్డుపడుతున్నారని పౌరహక్కుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.చిట్టిబాబు, చిలుకా చంద్రశేఖర్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితకు లేఖ రాశారు.

Updated Date - May 26 , 2025 | 04:22 AM