Share News

Speeding Kills Six: అతి వేగానికి ఆరుగురు బలి

ABN , Publish Date - May 01 , 2025 | 03:32 AM

నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ఓ వేగంగా దూసుకెళ్లిన కారు పూరింట్లోకి బలంగా ఢీకొని ఐదుగురు మెడికో విద్యార్థులు మరియు ఓ వృద్ధుడు మృతిచెందారు. మితిమీరిన వేగం ప్రాణాంతక ప్రమాదానికి కారణమై, సమస్తం తుడిచిపోయింది

Speeding Kills Six: అతి వేగానికి ఆరుగురు బలి

  • ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మెడికోల దుర్మరణం

  • ఇంట్లోని వృద్ధుడూ బలి.. నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం

ఘటనాస్థలిలో తుక్కుతుక్కైన కారు.. పూర్తిగా కుప్పకూలిన పూరిల్లు..కారు కింద వృద్ధుడు రమణయ్య మృతదేహం

కోవూరు, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): స్నేహితుడి సోదరి నిశ్చితార్థంలో ఉత్సాహంగా గడిపి తిరిగి బయలుదేరిన వారిని.. మృత్యువు కారు రూపంలో పొట్టన పెట్టుకుంది. వేగంగా వెళుతున్న కారు ఓ పూరింటిలోకి దూసుకెళ్లడంతో ఐదుగురు వైద్య విద్యార్థులతోపాటు, ఆ ఇంట్లో నిద్రిస్తున్న ఓ వృద్ధుడు మృత్యువాత పడ్డాడు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం సమీపంలోని జాతీయరహదారిపై బుధవారం మధ్యాహ్నం ఈ విషాదం చోటుచేసుకుంది. వివరాలివీ.. నెల్లూరు శివార్లలోని చింతారెడ్డిపాళెంలో ఉన్న నారాయణ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ రెండవ సంవత్సరం చదువుతున్న బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన చక్రధర్‌ సోదరి నిశ్చితార్థం బుచ్చిలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చక్రధర్‌ స్నేహితులు 12మంది రెండు కార్లలో వెళ్లారు. మధ్యాహ్నం భోజనాలు పూర్తయ్యాక తిరుగు ప్రయాణమయ్యారు. కాలేజీకి త్వరగా వెళ్లాలన్న ఆతృతతో ముందు వెళుతున్న వారు కారు వేగం పెంచారు. కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం సమీపంలో కారు అదుపుతప్పి ఓ పూరింటిలోకి దూసుకెళ్లింది.


ప్రమాదం దాటికి పూర్తిల్లు పూర్తిగా ధ్వంసమవగా, కారు నుజ్జునుజ్జయ్యింది. ఇంట్లో మంచంపై ఉన్న నిడిగుంట రమణయ్య(65)పైకి కారు దూసుకుపోవడంతో అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఉన్న వైద్యవిద్యార్థులు ఖామవత్‌ అభిషేక్‌ రాజ్‌(అనంతపురం), గుండాల జీవన్‌చంద్రారెడ్డి (సిద్దీపురం, నెల్లూరు జిల్లా), గుర్రం యజ్ఞేష్‌ (ఒంగోలు), లవదియా నరేష్‌ నాయక్‌(ధర్మవరం- అనంతపురం జిల్లా), గోను అభిసాయి పురుషోత్తం (తిరుపతి), వీరమల్లు నవనీత్‌రెడ్డి (మైదుకూరు, కడప జిల్లా) తీవ్రంగా గాయపడ్డారు. వెనుకనే మరో కారులో వస్తున్న స్నేహితులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఐదుగురూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మైదుకూరుకు చెందిన వీరమల్లు నవనీత్‌ నెల్లూరు నారాయణ వైద్యకళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


Also Read:

సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్

రిటైర్మెంట్‌పై బాంబు పేల్చిన ధోని

ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 01 , 2025 | 03:32 AM