Simhachalam Tragedy: మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం
ABN , Publish Date - May 01 , 2025 | 05:43 AM
సింహాచల గోడకూలిన విషాదంపై నేతల నుంచి తీవ్ర స్పందనలు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందన్న స్పష్టత; జగన్పై అధికార పార్టీ ప్రతికారాత్మక విమర్శలు

పునరావృతం కాకుండా చర్యలు: స్పీకర్ అయ్యన్న, అశోక్ గజపతి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్)
సింహాచలం దుర్ఘటనపై పలువురు నేతలు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఘటనలో పలువురు మృతిచెందడం, గాయపడడం బాధాకరమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ... ‘సింహాచలం ఘటన తీవ్రంగా కలిచివేసింది. ఇలాంటివి పునరావృతం కాకుండా దేవస్థానం వైపునుంచి చర్యలు తీసుకుంటాం. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకుంటాం’ అన్నారు. కాగా, సింహాచలం ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. క్షతగాత్రులకు విశాఖ కేజీహెచ్లో చికిత్స జరుగుతోందని, మెరుగైన చికిత్స అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రులకు తరలిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారు: మంత్రి పార్థసారథి
సింహాచలం ఘటనను జగన్ శవ రాజకీయం చేయడం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. చేతనైతే సాయం చేయాలి, మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ నేతలు మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా కనీసం బాధితులను పరామర్శించడానికి కూడా వెళ్లని జగన్ ఇప్పుడు శవ రాజకీయాలు చేస్తున్నారంటూ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ బుచ్చిరాంప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ దిగజారుడుతనానికి నిదర్శనం: మంత్రి ఆనం
ఆత్మకూరు/నెల్లూరు, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు దుర్మరణం చెందడంపై దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యమే ఈ దుర్ఘటనకు కారణమని తెలిపారు. ఇలాంటప్పుడు హుందాగా ప్రవదీనిని కూడా మాజీ సీఎం జగన్ తన క్షుద్ర రాజకీయాలకు వాడుకోవడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
Also Read:
సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్
రిటైర్మెంట్పై బాంబు పేల్చిన ధోని
ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..
For More Andhra Pradesh News and Telugu News..