Vijayawada Tahsildar: సిక్కిం వరదల్లో విజయనగరం తహసీల్దార్
ABN , Publish Date - Jun 02 , 2025 | 03:59 AM
సిక్కిం వరదల్లో చిక్కుకున్న తెలుగు కుటుంబాలను సురక్షితంగా రక్షించేందుకు ఏపీ భవన్ ప్రత్యేక సహాయక చర్యలు చేపడుతోంది. విజయనగరం తహసీల్దార్ కూర్మనాథరావు కుటుంబం సహా అన్ని బాధితులకు సహాయం అందిస్తున్నారు.

ప్రత్యేక సహాయక చర్యలు: ఏపీ భవన్
న్యూఢిల్లీ, జూన్ 1(ఆంధ్రజ్యోతి): సిక్కిం వరదల్లో చిక్కుకున్న తెలుగు కుటుంబాలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో ప్రత్యేక సహాయక చర్యలు చేపడుతున్నట్లు ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ ఎ.శ్రీకాంత్ తెలిపారు. వరదల్లో చిక్కుకున్న వారిలో విజయనగరం తహసీల్దార్ కూర్మనాథరావు, భార్య ఉమ, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్ర ఆదేశాలతో, సిక్కింలోని మంగన్ జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఇతర అధికారులతో సంప్రదింపులు జరిపామని పేర్కొన్నారు. సిక్కిం డీజీపీ శ్రీధరరావు బాధితుల సహాయక చర్యల్లో కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. కొండచరియలు విరిగి పడడంతో రాకపోకలు స్తంభించిపోయాయని, సోమవారం లోపు పునరుద్ధరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.