Share News

Vijayawada Police: కొమ్మినేని, కృష్ణంరాజుపై కేసు నమోదు

ABN , Publish Date - Jun 09 , 2025 | 04:10 AM

సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు, మరో జర్నలిస్టు వాడపల్లి కృష్ణంరాజుపై విజయవాడ పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం జగన్‌ చానల్‌లో...

Vijayawada Police: కొమ్మినేని, కృష్ణంరాజుపై కేసు నమోదు

విజయవాడ, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు, మరో జర్నలిస్టు వాడపల్లి కృష్ణంరాజుపై విజయవాడ పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం జగన్‌ చానల్‌లో కొమ్మినేని నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొన్న కృష్ణంరాజు అమరావతి మహిళలపై నోరు పారేసుకున్నారు. రాజధాని ప్రాంతంలో వేశ్యలు ఉన్నారని వ్యాఖ్యానించారు. కేఎ్‌సఆర్‌, కృష్ణంరాజుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా తెలుగు మహిళలు పటమట పోలీసులకు శనివారం రాత్రి ఫిర్యాదు చేశారు. దీనిపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Jun 09 , 2025 | 04:12 AM