CPI Ramakrishna: వీర్రాజును ట్రంప్‌ వద్దకు పంపాలి

ABN , First Publish Date - 2025-05-12T05:13:00+05:30 IST

బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. "ట్రంప్‌ చెబితే యుద్ధం ఆగిపోయిందా?" అంటూ విమర్శలు చేశారు

CPI Ramakrishna: వీర్రాజును ట్రంప్‌ వద్దకు పంపాలి

అమరావతి, మే 11(ఆంధ్రజ్యోతి): అనివార్యమైతే తప్ప యుద్ధం వద్దన్న సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణను పాకిస్థాన్‌కు పంపించాలంటూ బీజేపీ సీనియర్‌ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు మతిభ్రమించి విమర్శలు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఒక ప్రకటనలో ఖండించారు. ‘ట్రంప్‌ చెబితే ప్రస్తుతం భారత్‌ పాక్‌ యుద్ధ్దం ఆగిందా? లేదా?, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, ప్రజల విచక్షణను గాలికి వదిలి ట్రంప్‌ చెప్పిన మాటలు విని యుద్ధం ఆపేయడం నిజం కాదా?’ అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి అమెరికా వెళ్లి గురువు ట్రంప్‌తో ఉంటే మంచిదని హితవు పలికారు.

Updated Date - 2025-05-12T05:13:01+05:30 IST