Share News

Visit Postponed: రాష్ట్రపతి విశాఖ పర్యటన వాయిదా

ABN , Publish Date - Jun 08 , 2025 | 03:41 AM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం పర్యటన వాయిదా పడింది. ఈ నెల పదో తేదీన నగరంలోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు.

Visit Postponed: రాష్ట్రపతి విశాఖ పర్యటన వాయిదా

విశాఖపట్నం, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం పర్యటన వాయిదా పడింది. ఈ నెల పదో తేదీన నగరంలోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కావలసి ఉంది. అధికార యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అనివార్య కారణాలవల్ల స్నాతకోత్సవాన్ని తాత్కాలికంగా వాయిదావేశామని, త్వరలో మరోతేదీ ప్రకటిస్తామని విశ్వవిద్యాలయం మీడియా సెల్‌ చైర్మన్‌ తెలిపారు

Updated Date - Jun 08 , 2025 | 03:43 AM