PM Modi - Amaravati: అమరావతి పున:ప్రారంభ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన
ABN , Publish Date - May 02 , 2025 | 05:33 PM
చంద్రబాబు.. నా టెక్నాలజీ వాడకం గురించి చెప్పారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు.. ఏపీ సీఎంగా చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని నేను గమనించాను. చంద్రబాబును చూసి నేర్చుకొన్నా.

PM Modi - Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పున:ప్రారంభ పనులకు ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అమరావతిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి అని మోదీ అన్నారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.."అమరావతి స్వప్నం సాకారమవుతోంది. చారిత్రక పరంపర, ప్రగతి రెండూ కలిపి పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్ రూపుదాల్చుతోంది. దుర్గాభవానీ కొలువైన ఈ భూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. బౌద్ధ వారసత్వం, ప్రగతి కలగలిపిన ప్రాంతం ఇది. ఇప్పుడు నేను ఈ పుణ్యభూమిపై నిలబడి ఉన్నాను." అని తన ప్రసంగంలో వెల్లడించారు.
అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి అని పేర్కొన్న ప్రధాని మోదీ.. "ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అమరావతికి ఉంది. ఇవి శంకుస్థాపనలు కాదు.. ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్కు నిదర్శనం. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతం. రికార్డు స్పీడ్లో అమరావతి నిర్మాణాలు కొనసాగేందుకు కేంద్రం సహకరిస్తుంది. ఏపీలోకి ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుంది. చంద్రబాబు.. నా టెక్నాలజీ వాడకం గురించి చెప్పారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు.. ఏపీ సీఎంగా చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని నేను గమనించాను. చంద్రబాబును చూసి నేర్చుకొన్నా." ప్రధాని మోదీ అన్నారు.
స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతమన్న ప్రధాని మోదీ.. "రికార్డు స్పీడ్లో అమరావతి నిర్మాణాలు కొనసాగేందుకు కేంద్రం సహకరిస్తుంది. ఏపీలోకి ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుంది. రాజధాని అమరావతి ఏపీ ఆశలు, వికసిత్ భారత్ ఆశలు.. స్వర్ణాంధ్రకు బీజం. ఏపీని అధునాతన రాష్ట్రంగా మార్చబోతోంది అమరావతి. అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి." అని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించడం విశేషం.. "అమరావతి స్వప్నం సాకారమవుతున్నట్లు కనిపిస్తోంది. చారిత్రక పరంపర, ప్రగతి రెండూ కలిపి పయనిస్తున్నట్లు గోచరిస్తోంది. ఒక కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్. దుర్గాభవానీ కొలువైన ఈ భూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. బౌద్ధ వారసత్వం, ప్రగతి కలగలిపిన ప్రాంతం ఇది.
ఇప్పుడు నేను ఈ పుణ్యభూమిపై నిలబడి ఉన్నాను. అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అమరావతికి ఉంది. అని మోదీ ఆసక్తికర ప్రసంగం చేశారు.