Share News

Road Accident: బస్సు బోల్తా.. పలువురు ప్రయాణికులకు గాయాలు

ABN , Publish Date - Nov 21 , 2025 | 07:11 AM

విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు .. నెల్లూరు జిల్లాలోని జాతీయ రహదారిపై బోల్తా పడింది.ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

Road Accident: బస్సు బోల్తా.. పలువురు ప్రయాణికులకు గాయాలు

నెల్లూరు, నవంబర్ 21: ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్ల వారి మిట్ట జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులతోపాటు 108కి సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం 108 వాహనంలో నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన స్థలాన్ని ఎస్ఐ నాగరాజు పరిశీలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.


డ్రైవ్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు ఆరోపించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారని ఎస్ఐ నాగరాజు చెప్పారు. ఈ బస్సులోని ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఈ బస్సు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడానికి పోలీసులు రంగంలో దిగారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బాలింతలకు పాలు బాగా పడాలంటే ఇవిగో చిట్కాలు..

రాష్ట్రంలో అర్బన్‌ నక్సల్స్‌ జల్సాలు

For More AP News And Telugu News

Updated Date - Nov 21 , 2025 | 08:45 AM