Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ABN , Publish Date - Jun 05 , 2025 | 08:14 AM
Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలు పనుల నిమిత్తం ఆటోలో బయలుదేరి వెళుతుండగా ఆత్మకూరు మండలంలోని ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద ఆటోను కారు బలంగా ఢీ కొంది. ఈ ఘటనలో 4 గురు మృతి చెందగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.

నెల్లూరు జిల్లా: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (Nellore Dist) ఆత్మకూరు మండలం (Atmakur Mandal)లోని ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆటోను కారు ఢీకొన్న ఈ ఘటనలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కూలీలు వెంకటరావుపల్లి నుంచి ముస్తాపురంకు ఆటోలో వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు రెండు రోజుల క్రితం ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఓజిలీ మండలం, రాచపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్, ఎల్బీనగర్కు చెందిన 11 మంది పెద్దలు, ముగ్గురు చిన్నారులు టెంపోలో విహారయాత్రకు వెళ్లారు. రాచపాలెం జాతీయ రహదారివద్దకు వచ్చేసరికి టెంపో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో టెంపో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రశాంతి, అంజమ్మ, సబిత అనే ముగ్గురు తీవ్రంగా గాయపడగా, మిగిలినవారు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో గూడూరులో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
For More AP News and Telugu News