Share News

Kakani Case: కాకాణికి మరోసారి బిగ్ షాక్

ABN , Publish Date - Jun 05 , 2025 | 01:07 PM

Kakani Case: అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. కాకాణి బెయిల్ పిటిషన్‌పై నెల్లూరు కోర్టులో వాదనలు జరిగాయి.

Kakani Case: కాకాణికి మరోసారి బిగ్ షాక్
Kakani Case

నెల్లూరు, జూన్ 5: క్వార్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి (Former Minister Kakani Goverdhan Reddy) నెల్లూరు జిల్లా కోర్టు మరోసారి షాకిచ్చింది. కాకాణి బెయిల్ పిటిషన్‌పై ఈరోజు (గురువారం) కోర్టులో వాదనలు జరిగాయి. ఈ బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అంతేకాకుండా కాకాణిని కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు పిటిషన్‌ వేయగా.. దానిపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇక కాకాణి అక్రమ మైనింగ్ కేసును పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. నెల్లూరు జిల్లాలో కాకాణి ఆధ్వర్యంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ కేసును విచారించేందుకు మొదట నాయుడుపేట ఏపీపీ కేథార్ నాథ్‌ను స్పెషల్ పీపీగా బాధ్యతలు ఇచ్చి నెల్లూరుకు పంపింది ప్రభుత్వం. నేడు కేథార్ నాథ్ స్థానంలో గుంటూరు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రొసీక్యూషన్ రాజేంద్ర ప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో నెల్లూరు ఎస్సీ ఎస్టీ 5వ అదనపు ప్రత్యేక న్యాయస్థానానికి రాజేంద్రప్రసాద్ చేరుకుని కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు.


ఇక ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నిందితులు, సాక్షులను విచారించారు. ఇప్పటికే అనేకమైన అక్రమాలు పోలీసుల విచారణలో వెలుగు చూశాయి. కాకాణి ఇప్పటి వరకు నోరు మెదపని పరిస్థితి. ఈ కేసులో మొదటి నుంచి కాకాణి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఈ కేసు నమోదు అయిన తర్వాత దాదాపు రెండు నెలల పాటు మాజీ మంత్రి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగారు. కేసుకు సంబంధించి పలుమార్లు కాకాణికి పోలీసులు నోటీసులు ఇచ్చారు కూడా. చివరకు బెంగళూరు శివారులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


అరెస్ట్ తర్వాత అక్రమ మైనింగ్‌కు సంబంధించి పలు ప్రశ్నలు సంధించగా.. తనకు తెలీదని, సంబంధం లేదంటూ కాకాణి సమాధానాలు ఇచ్చారు. ఇప్పటికే అనేక మంది సాక్షులను విచారించగా.. కాకాణి చెబితేనే అక్రమాలకు పాల్పడ్డామంటూ విచారణలో వెల్లడించారు. దాదాపు 61వేల మెట్రిక్ టన్నుల క్వార్జ్‌ను తక్కువ సమయంలో భారీ పేలుడు పదార్థాలతో పేల్చి చైనా వంటి దేశాలకు ఎగుమతులు చేసిన పరిస్థితి. ఇప్పటికే చైనా దేశంలో ఏ సంస్థలకు పంపించారు, వాళ్లు డబ్బులను ఎవరెవరి ఖాతాలకు వేసారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈరోజు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిస్తే కాకాణిని మరిన్ని ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఈ కేసులో కాకాణి నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.


ఇవి కూడా చదవండి

మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములవ్వండి.. సీఎం చంద్రబాబు పిలుపు

జగనన్నా.. మాకు దిక్కెవరన్నా.. నెల్లూరులో ఫ్లెక్సీల కలకలం

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 01:11 PM