MP Kalisetty Appalanayudu : ఎన్టీఆర్ ట్రస్టుకు ఏటా నెల జీతమిస్తా
ABN , Publish Date - Feb 09 , 2025 | 04:00 AM
నెల జీతాన్ని ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో తలసీమియా బాధితుల సహాయార్థం అందజేస్తానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.

ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
అమరావతి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ఎంపీగా తనకు వచ్చే ఒక నెల జీతాన్ని ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో తలసీమియా బాధితుల సహాయార్థం అందజేస్తానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ఎన్టీఆర్ ట్రస్టు సీఈవో కె.రాజేంద్రకుమార్, సీఎ్ఫవో గోపీని కలిసి ఈమేరకు హామీ ఇచ్చారు. తలసీమియా బాధితులకు సాయం కోసం ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో 15న జరిగే సంగీత కార్యక్రమానికి తన గౌరవ వేతనం నుంచి కుటుంబ సభ్యులందరికీ టికెట్లు కొని హాజరవుతానని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..
Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..