APCO Corruption: ఆప్కోలో అవినీతి ట్యాగ్లు
ABN , Publish Date - Jun 08 , 2025 | 05:04 AM
ఉదర్కా మాల్ ఇదర్.. ఇదర్కా మాల్ ఉదర్.. ఓ సినిమాలో ఈ డైలాగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సహకార సంఘం(ఆప్కో)లో తాజాగా బయటపడ్డ అవినీతికి ‘అతికినట్లే’ సరిపోతుంది. కొత్తపుంతలు తొక్కిన ఈ అవినీతిని చూస్తే ఔరా! అని పించకమానదు. నూలు పోగులు పేర్చి అందమైన వస్త్రాన్ని తీర్చిదిద్దే నేతన్నలకు అండగా నిలవాల్సిన ఆప్కోలో ధరల ట్యాగ్ల మాయాజాలం ఒకటి వెలుగుచూసింది. ఖరీదైన చేనేత చీరలను బిల్లులు లేకుండా విక్రయించేసి.. ఆ చీరల స్థానంలో..

బిల్లులు లేకుండా ఖరీదైన చీరల విక్రయం
వాటి ధరల ట్యాగ్లు బయట నుంచి తెచ్చిన చవక చీరలకు..
స్టాకు రికార్డుల్లో తేడా రాకుండా మతలబు
రికార్డుల ప్రకారం స్టాకు విలువ రూ. 100 కోట్లు
నిజానికి ఉన్నది రూ. 30 కోట్ల విలువైన స్టాకే
ఓ అధికారి నేతృత్వంలోనే విచ్చలవిడిగా అవినీతి
వైసీపీ హయాంలో మొదలై ఇప్పటికీ కొనసాగుతున్న దోపిడీ
తక్షణమే విజిలెన్స్తో ఆడిట్ చేయించాలంటున్న చేనేత సంఘాలు
ముఖ్యమంత్రి చంద్రబాబుకు వరుస లేఖలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఉదర్కా మాల్ ఇదర్.. ఇదర్కా మాల్ ఉదర్.. ఓ సినిమాలో ఈ డైలాగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సహకార సంఘం(ఆప్కో)లో తాజాగా బయటపడ్డ అవినీతికి ‘అతికినట్లే’ సరిపోతుంది. కొత్తపుంతలు తొక్కిన ఈ అవినీతిని చూస్తే ఔరా! అని పించకమానదు. నూలు పోగులు పేర్చి అందమైన వస్త్రాన్ని తీర్చిదిద్దే నేతన్నలకు అండగా నిలవాల్సిన ఆప్కోలో ధరల ట్యాగ్ల మాయాజాలం ఒకటి వెలుగుచూసింది. ఖరీదైన చేనేత చీరలను బిల్లులు లేకుండా విక్రయించేసి.. ఆ చీరల స్థానంలో తక్కువ ధర చీరలు తెచ్చిపెట్టి వాటికి అమ్మేసిన చీరల ట్యాగ్లు అతికించేసి కోట్లాది రూపాయలు నొక్కేశారు. వైసీపీ హయాంలో మొదలైన ఈ అవినీతి బాగోతం.. ఇప్పటికీ కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఆప్కో షోరూమ్లు, డిపోల్లో మొత్తం రూ. 100 కోట్ల విలువైన చీరలు ఉన్నట్లు రికార్డుల్లో చూపిస్తుంటే వాటి అసలు ధర రూ. 30 కోట్లకు మించి ఉండదని చేనేత సహకార సంఘాలు ముఖ్యమంత్రికి రాసిన వరుస లేఖల్లో పేర్కొన్నాయి. తక్షణమే విజిలెన్స్ను రంగంలోకి దించి ఆడిట్ చేయిస్తే వెయ్యి రూపాయల విలువైన చీరపై పదకొండు వేల రూపాయల ట్యాగ్ కనిపిస్తుందని చెబుతున్నాయి. ఆప్కోలో ‘మూర్తీ’భవించిన అవినీతిలా వెలిగే ఓ అధికారి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా ప్రసిద్ధుడైన నేత అండదండలతో అప్పట్లో రెచ్చిపోయిన ఆ అధికారి ప్రస్తుత ప్రభుత్వంలో తనకు ఓ ప్రజాప్రతినిధి నుంచి సంపూర్ణ మద్దతు ఉందని చెప్పుకుంటున్నారు. తనను అన్నా అని పిలిచే ఒక మంత్రి పేరు చెబుతూ.. ‘అన్నీ మినిస్టరే చూసుకుంటానని చెప్పారు.. నాకేమీ కాదు’ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
డివిజన్కు ఐదు లక్షలు ఇవ్వాల్సిందే..
రాష్ట్రంలో తొమ్మిది చేనేత డివిజన్లు ఉన్నాయి. వాటి నుంచి ప్రతి నెలా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే అంటూ ఆ అధికారి ఆప్కోను పీల్చి పిప్పి చేస్తున్నారని, అందుకే ఇలాంటి అక్రమాలు జరగుతున్నాయని నేతన్నలు చెబుతున్నారు. అంత మొత్తం ఎలా ఇచ్చుకోవాలో తెలియక తలలు పట్టుకొంటున్న వారికి ధరల ట్యాగ్ల మార్పు సలహాలిచ్చి మరీ దోచుకొంటున్న ఆ అధికారి గురించి ముఖ్యమంత్రికి రాసిన లేఖల్లో ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు ఏరికోరి తెచ్చుకున్న ఆయనకు మద్దతుగా నిలుస్తోన్న ప్రజా ప్రతినిధులకూ వాటా ఉందని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విచారణకు ఆదేశిస్తే మొత్తం వ్యవహారం బయట పడి ఇటు చేనేత వర్గాలకు న్యాయం జరిగి అటు ఆప్కో నిర్వీర్యం కాకుండా నిలబడే అవకాశం ఉందని నేతన్నలు చెబుతున్నారు.
తమిళనాడు చవక చీరలు తెచ్చి..
ఆంధ్రప్రదేశ్లో లక్షన్నర వరకూ చేనత మగ్గాలుంటే సుమారు 952 చేనేత సహకార సంఘాలున్నాయి. అధికారికంగా మూడున్నర లక్షల మంది చేనేత కార్మికులు మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరి నుంచి చీరలు, ఇతర వస్త్రాలు సేకరించి సొసైటీలు ఆప్కోకు సరఫరా చేస్తే అక్కడ విక్రయించి నేతన్నను ఆదుకోవాలి. చేనేత కార్మికులు కష్టపడి నేస్తున్న చీరలు, వస్త్రాలు ఐదేళ్ల క్రితం వరకూ ఆప్కో బాగానే కొనుగోలు చేసింది. కరోనా సమయం(2020) నుంచి కొనుగోళ్లు తగ్గించి అప్పటికే ఉన్న స్టాకు విక్రయిస్తూ వచ్చింది. ఇక్కడే అవినీతికి తెరలేచింది. అదెలాగంటే.. ధర్మవరం, మాధవరం, వెంకటగిరి, చీరాల, మంగళగిరి, ఉప్పాడ తదితర ప్రాంతాల్లోని ఖరీదైన చీరలు బిల్లులు లేకుండా విక్రయించడం మొదలు పెట్టారు. అయితే ఆడిట్ జరిగినప్పుడు విషయం బయట పడకుండా ఉండేందుకు విక్రయించిన చీరల రేట్ల ట్యాగ్లు తక్కువ ధర చీరలకు అతికించి షోరూముల్లో స్టాకు ఉన్నట్లే చూపిస్తున్నారు. తమిళనాడులోని కొయంబత్తూరు, ఈరోడ్ నుంచి మన చేనేతల రకాలను పోలిన తక్కువ ధర చీరల్ని తీసుకొచ్చి పెట్టి అమ్మేసిన చీరల ధరల ట్యాగులు తగిలించి స్టాకు నిల్వలో ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్త పడుతున్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే అసలు గుట్టు రట్టవుతుందని, విజిలెన్స్ రంగంలోకి దిగితే ఈ అవినీతి బండారం బయటపడుతుందని చేనేత సంఘాల ప్రతినిధులు నేరుగా ముఖ్యమంత్రికి రాసిన లేఖల్లో వివరించారు. ఆంధ్రప్రదేశ్లో లక్షన్నర వరకూ చేనత మగ్గాలుంటే సుమారు 952 చేనేత సహకార సంఘాలున్నాయి. అధికారికంగా మూడున్నర లక్షల మంది చేనేత కార్మికులు మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్నారు.
వీరి నుంచి చీరలు, ఇతర వస్త్రాలు సేకరించి సొసైటీలు ఆప్కోకు సరఫరా చేస్తే అక్కడ విక్రయించి నేతన్నను ఆదుకోవాలి. చేనేత కార్మికులు కష్టపడి నేస్తున్న చీరలు, వస్త్రాలు ఐదేళ్ల క్రితం వరకూ ఆప్కో బాగానే కొనుగోలు చేసింది. కరోనా సమయం(2020) నుంచి కొనుగోళ్లు తగ్గించి అప్పటికే ఉన్న స్టాకు విక్రయిస్తూ వచ్చింది. ఇక్కడే అవినీతికి తెరలేచింది. అదెలాగంటే.. ధర్మవరం, మాధవరం, వెంకటగిరి, చీరాల, మంగళగిరి, ఉప్పాడ తదితర ప్రాంతాల్లోని ఖరీదైన చీరలు బిల్లులు లేకుండా విక్రయించడం మొదలు పెట్టారు. అయితే ఆడిట్ జరిగినప్పుడు విషయం బయట పడకుండా ఉండేందుకు విక్రయించిన చీరల రేట్ల ట్యాగ్లు తక్కువ ధర చీరలకు అతికించి షోరూముల్లో స్టాకు ఉన్నట్లే చూపిస్తున్నారు. తమిళనాడులోని కొయంబత్తూరు, ఈరోడ్ నుంచి మన చేనేతల రకాలను పోలిన తక్కువ ధర చీరల్ని తీసుకొచ్చి పెట్టి అమ్మేసిన చీరల ధరల ట్యాగులు తగిలించి స్టాకు నిల్వలో ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్త పడుతున్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే అసలు గుట్టు రట్టవుతుందని, విజిలెన్స్ రంగంలోకి దిగితే ఈ అవినీతి బండారం బయటపడుతుందని చేనేత సంఘాల ప్రతినిధులు నేరుగా ముఖ్యమంత్రికి రాసిన లేఖల్లో వివరించారు.