మహానాడుకు అన్ని డిపోల నుంచి బస్సులు: రవాణా మంత్రి రాంప్రసాద్
ABN , Publish Date - May 27 , 2025 | 05:58 AM
మహానాడు ముగింపు రోజున 5 లక్షల మందికి హాజరు కోవాలని ఊహిస్తూ రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి కడపకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. భద్రత మరియు సౌకర్యాల కోసం ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

కడప మారుతీనగర్, మే 26(ఆంధ్రజ్యోతి): కడపలో మూడు రోజుల పాటు జరగనున్న మహానాడులో భాగంగా చివరి రోజైన గురువారం నిర్వహించే బహిరంగ సభకు ఐదు లక్షల మంది వరకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల నుంచి కడపకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన స్థానిక ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయ భవనంలో ఆర్టీసీ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మహానాడుకు టీడీపీ శ్రేణులు, అభిమానులు తరలిరానున్న నేపథ్యంలో.. వారిని సురక్షితంగా కడపకు చేరవేసేందుకు వీలుగా అవసరమైన బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూలనాగరాజు, కడప జోన్ ఈడీ చంద్రశేఖర్, ఆర్ఎం గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.