Bay Of Bengal Low Pressure: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం
ABN , Publish Date - Jul 25 , 2025 | 04:13 AM
ఉత్తర బంగాళాఖాతం పరిసరాల్లో గురువారం ఏర్పడిన అల్పపీడనం సాయంత్రానికే..

నేడు వాయుగుండంగా మారే అవకాశం
రానున్న మూడు రోజులూ కోస్తా, సీమల్లో వర్షాలు
అమరావతి, విశాఖపట్నం, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఉత్తర బంగాళాఖాతం పరిసరాల్లో గురువారం ఏర్పడిన అల్పపీడనం సాయంత్రానికే తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో శుక్రవారం నాటికి మరింత బలపడి వాయుగుండంగా మారనుందని వాతావరణ ్జశాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న 48 గంటల్లో కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, ఉత్తరకోస్తాలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మో స్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్స్టాప్లు
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
For More National News And Telugu News