Share News

MLA Adinarayana: లిక్కర్‌ సొమ్ముతో బంగారం

ABN , Publish Date - Jun 12 , 2025 | 05:00 AM

వైసీపీ పాలనలో యథేచ్ఛగా దోచుకున్న లిక్కర్‌ సొమ్ముతో జగన్‌రెడ్డి సతీమణి భారతీరెడ్డి సుమారు 400 కేజీల బంగారం కొనుగోలు చేశారని ప్రభుత్వ విప్‌, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆరోపించారు

 MLA Adinarayana: లిక్కర్‌ సొమ్ముతో బంగారం

  • భారతీరెడ్డి 400 కేజీలు కొన్నారు

  • జగన్‌ జైలుకెళ్లడం ఖాయం : ఆదినారాయణరెడ్డి

కడప మారుతీనగర్‌, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో యథేచ్ఛగా దోచుకున్న లిక్కర్‌ సొమ్ముతో జగన్‌రెడ్డి సతీమణి భారతీరెడ్డి సుమారు 400 కేజీల బంగారం కొనుగోలు చేశారని ప్రభుత్వ విప్‌, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. బుధవారం ఇక్కడ వికసిత్‌ భారత్‌ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ ‘జగన్‌రెడ్డి-భారతిల చరిత్ర మహాభారతం కంటే చాలా పెద్దది. తల్లిని చెల్లిని దూరం పెట్టిన దుర్మార్గుడు కాబట్టే అమరావతి మహిళలపై అసభ్యపదజాలంతో వాఖ్యలు చేసిన వారికే వంత పలుకుతున్నాడు. లిక్కర్‌ కేసులో జగన్‌రెడ్డి జైలుకెళ్లడం ఖాయం. ఆయనతో పాటు చాలామంది జైలు ఊచలు లెక్కపెట్టడం తథ్యం’ అని ఆదినారాయణరెడ్డి అన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 05:02 AM