AP Farmers: ఏపీ రైతులకు కేంద్రం శుభవార్త..
ABN , Publish Date - Jun 12 , 2025 | 03:41 PM
AP Farmers: ఆంధ్రప్రదేశ్ అన్నదాతలకు కేంద్రం శుభవార్త చెప్పింది. కందిపప్పు సేకరణ గడువును మరో 15 రోజులకు పొడిగించినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

అమరావతి, జూన్ 12: రాష్ట్ర రైతులకు (AP Farmers) కేంద్రం (Central Govt) గుడ్ న్యూస్ చెప్పింది. కందిపప్పు సేకరణ గడువును పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Ram Mohan Naidu) సామాజిక మాధ్యమం ఎక్స్లో వెల్లడించారు. కందిపప్పు సేకరణను మరో 15 రోజులకు పొడిగింపుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుపుతూ.. ఈ నిర్ణయంలో త్వరితగతిన సహకరించి రైతులకు ఎంతో ఉపయోగపడేలా చర్యలు తీసుకున్నందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు (Union Minister Shivraj Singh Chouhan) కేంద్రమంత్రి రామ్మోహన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కేంద్రమంత్రి ట్వీట్ ఇదే..
‘ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త. కందిపప్పు సేకరణ గడువుపై మన ప్రభుత్వ అభ్యర్థనను పరిశీలించి ఖరీఫ్ 2024–25 కాలానికి కంది పప్పు సేకరణ గడువును కేంద్రం మరో 15 రోజులు పొడిగించింది. సేకరణ పరిమితి 95,620 మెట్రిక్ టన్నులుగా జూన్ 26 వరకు రైతుల నుంచి కంది పప్పు మద్దతు ధరపై సేకరిస్తారు. ఈ నిర్ణయంలో త్వరితగతిన సహకరించి రైతులకు ఎంతో ఉపయోగపడేలాగా చర్యలు తీసుకున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు మా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వం మన రైతుల సంక్షేమం కోసం గ్రామీణ ప్రాంతా అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తోంది’ అంటూ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి
పరీక్షలు మొదలయ్యాయి ఆపలేం.. డీఎస్సీపై సుప్రీం
మామా అన్నాడని దాడి.. కావాలిలో వైసీపీ నేత దాష్టీకం
Read latest AP News And Telugu News