Share News

TDP Vs YSRCP: తిరువూరులో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట

ABN , Publish Date - May 19 , 2025 | 11:48 AM

TDP Vs YSRCP: తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరగడంతో వారిని పోలీసులు చెదరగొట్టారు.

TDP Vs YSRCP: తిరువూరులో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట
TDP Vs YSRCP Tiruvuru

ఎన్టీఆర్ జిల్లా, మే 19: తిరువూరులో నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక (Tiruvuru Nagar Panchayat Chairman Election) నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ (YSRCP), టీడీపీ (TDP) నేతలు తోపులాటకు దిగారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఇరుపార్టీ నేతలను పోలీసులు చెదరగొట్టారు. ఇప్పటికే ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు (YCP councilors) టీడీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే, కౌన్సిలర్లు పంచాయతీ సమావేశం హాల్‌లోకి వెళ్లారు.


నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈరోజు (సోమవారం) ఉదయం నుంచి కూడా టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో.. వారినిని పోలీసులు చెదరగొడుతున్నారు. ఛైర్మన్ ఎన్నిక సందర్బంగా ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను కల్పించారు. ఈ క్రమంలో కౌన్సిల్ హాల్‌లోకి వెళ్లేందుకు వైసీపీ సభ్యులు బారికేడ్లు నెట్టుకుని లోపలికి వచ్చే ప్రయత్నం చేయగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ, వైసీపీ సభ్యులను ఇద్దరినీ కూడా చెదరగొట్టి శాంతియుత వాతావరణంలో ఎన్నిక జరగాలని పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. అలాగే మరో ఐదుగురు సభ్యులు టీడీపీ మద్దతు తెలిపారు. ఈ క్రమంలో తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంటుందన్న ఉద్దేశంతో వైసీపీ సభ్యులు హైడ్రామాకు తెరలేపారు. ఎట్టిపరిస్థితుల్లో అయినా ఛైర్మన్ పదవిని దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి జోగి రమేష్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.


నేటితో తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడనుంది. ఈరోజు నగర పంచయతీ ఛైర్మన్ ఎన్నికకు మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అధికారిగా తిరువూరు ఆర్డీవో కె.మాధురిని ఎన్నికల కమిషన్ నియమించింది. గత నెల 3న వైసీపీ చైర్ పర్సన్‌ గత్తం కస్తూరి బాయ్ తన పదవికి రాజీనామాతో ఖాళీ ఏర్పడింది. నగర పంచాయతీలో మొత్తం కౌన్సిల్ సభ్యులు 20కు గాను వైసీపీ 17, టీడీపీకి ముగ్గురు సభ్యులు, ఎక్సఫిషోయో సభ్యులుగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఉన్నారు. వైసీపీ కౌన్సిలర్లు కొందరు టీడీపీకి మద్దతు ఇస్తే ఛైర్మన్ పీఠం టీడీపీకి దక్కే అవకాశం ఉంది. వైసీపీ సభ్యులు ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం. వైసీపీలో ఉన్న విబేధాలు కారణంగా కొందరు వైసీపీ సభ్యులు పక్క చూపులు చూస్తున్న పరిస్థితి.


ఇవి కూడా చదవండి

Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్

Diamond: వజ్రాన్ని విక్రయించిన రైతు.. ధర ఎంతంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - May 19 , 2025 | 12:08 PM