Tiruvuru నగర పంచాయతీ ఛైర్పర్సన్గా టీడీపీ అభ్యర్థి ఎన్నిక
ABN , Publish Date - Jun 02 , 2025 | 02:13 PM
Krishna Dist: తిరువూరు నగర పంచాయతీ ఛైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ సోమవారం ఆర్డీవో మాధురి నిర్వహించారు. ఈ ఎన్నికలో తెలుగుదేశం బలపరిచిన తిరువూరు 1వ వార్డు కౌన్సిలర్ నిర్మల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 20 మంది సభ్యుల్లో 10 మంది టీడీపీకి మద్దతు తెలపగా.. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్యే కూడా టీడీపీకి మద్దతు ఇచ్చారు. దీంతో నిర్మల ఎన్నిక అయ్యారు.

Krishna Dist: తిరువూరు (Tiruvuru) నగర పంచాయతీ ఛైర్పర్సన్(Chairperson)గా కొలికపోగు నిర్మల (Kolikapogu Nirmala) ఎన్నికయ్యారు. ఆమెకు ఎక్స్ అఫిషియో సభ్యుడు, స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మద్దతు తెలపడంతో ఆయన ఓటు సహా మొత్తం 11 ఓట్లు లభించాయి. వైసీపీ తరఫున 9 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. గత నెల రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న తిరువూరు నగర పంచాయతీ తెలుగుదేశం (TDP) కైవసం చేసుకుంది. గత నెల 19, 20 తేదీల్లో జరిగిన నగర పంచాయతీ ఛైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. కాగా వైసీపీ చైర్మన్ అభ్యర్థి మోదుగు ప్రసాద్కు 9 ఓట్లు వచ్చాయి. దీంతో చైర్మన్గా టీడీపీ అభ్యర్తి కొలికపోగు నిర్మల ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఆర్డివో మాధురి, అబ్సర్వర్ లక్ష్మీ నరసింహం ప్రటించారు.
రెండు సార్లు వాయిదా పడిన తిరువూరు నగర పంచాయతీ ఛైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియను సోమవారం ఆర్డీవో మాధురి నిర్వహించారు. ఈ ఎన్నికలో తెలుగుదేశం బలపరిచిన తిరువూరు 1వ వార్డు కౌన్సిలర్ నిర్మల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 20 మంది సభ్యుల్లో 10 మంది టీడీపీకి మద్దతు తెలపగా.. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్యే కూడా టీడీపీకి మద్దతు ఇచ్చారు. దీంతో నిర్మల ఎన్నిక అయ్యారు. అయితే ఈ ఛైర్పర్సన్ పదవిని వైసీపీ కైవసం చేసుకునేందుకు కుయక్తులు పన్నినా.. కుదరలేదు. ఎన్నిక జరగకుండా విజయవాడ నుంచి వచ్చిన దేవినేని అవినాష్, స్థానిక వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో రెండు సార్లు ఎన్నిక వాయిదా పడింది. సోమవారం కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నిక పక్రియ పూర్తి చేశారు.
Also Read: పోలవరం-బనకచర్లపై కీలక సమావేశం
మరోవైపు కృష్ణా జిల్లా, అవనిగడ్డలో సోమవారం కోలాహలంగా కొడాలి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్గా తోట కనకదుర్గ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జనసైనికులు చల్లపల్లి నుంచి కొడాలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, టీడీపీ రాష్ట్ర నేత కనపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమల నినాదాల ఘటనలో కీలక పరిణామం..
ఆంధ్రజ్యోతి విజయోత్సవ సభకు డైరెక్టర్ వేమూరి ఆదిత్య
For More AP News and Telugu News